Sarkar Live

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ

ACB Raids | ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదును చూసి ప‌క్కా వ్యూహంతో అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంటోంది. తాజాగా ఓ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation

ACB Raids

ACB Raids | ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదును చూసి ప‌క్కా వ్యూహంతో అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంటోంది. తాజాగా ఓ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation Department)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స‌ద‌రు అవినీతి అధికారి ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గా విధులు నిర్వహిస్తున్న ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మధ్య‌లో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివ‌ర‌కు బేరం రూ.75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద్యారణ్యపురి కాలనీలో ఉంటున్న తన ఇంట్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు రవీందర్ వద్ద రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అమరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. . కాగా అమరేందర్ రెడ్డి గ‌తంలో చాలా మంది కాంట్రాక్టర్ల వద్ద భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే ఏసీబీ అధికారులు వస్తారని ఊహించిన సదరు అధికారి.. ముంద‌స్తుగా ఇంటి బయట ఆరేసిన తన కొడుకు టీ షర్ట్ లో డబ్బులు ఉంచి, ఇంటి వెనక బహిరంగ ప్రదేశంలో ఉంచాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించాడు. అయినా అధికారి ప్లాన్ ఫలించలేదు. ముందే పసిగట్టిన ఎసిబి అధికారులు చాకచక్యంగా వ్యవహరించి అమరేందర్ రెడ్డిని పట్టుకున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన పుటేజి ఆధారంగా అమరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శనివారం కరీంనగర్ లోని ఏసీబీ కోర్టులో అమరేందర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు జెసిబి డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

ACB : నిర్భ‌యంగా స‌మాచార‌వ‌మివ్వండి

ఎవ‌రైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాల‌ని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.అంతే కాకుండా వివిధ సామజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB
) వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చ‌ని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!