ACB Raids in Mulugu | కొన్ని రోజులుగా ఏసీబీ (Anti-Corruption Bureau) దూసుకుగా ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారులపై ఉక్కు మోపుతోంది. ఏ చిన్న పనికైనా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది.
తాజాగా ఈరోజు (జూన్ 16న) లంచం తీసుకుంటుండగా ములుగు జిల్లా డీఈవో (District Educational Officer), జూనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేశారు అనిశా అధికారులు. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయునికి పోస్టింగ్ ఇచ్చేందుకు డీఈవో, జూనియర్ అసిస్టెంట్. ఏకంగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారు దీంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడి నుంచి డీఈవో ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దిడీఈవో ఫణిని, జూనియర్ అసిస్టెంట్ దిలీప్ అదుపులోకి తీసుకున్నారు. డీఈవో కార్యాలయంలో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
అవినీతి అధికారులపై ఇలా ఫిర్యదు చేయొచ్చు..
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.