Sarkar Live

ArcelorMittal | ఉక్కు ఫ్యాక్ట‌రీకి మార్గం సుగుమం.. తొల‌గిన అడ్డంకులు

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఉక్కు కర్మాగారం (integrated sintegrated steel plant) స్థాపించేందుకు ఆర్సెలర్‌మిట్టల్ (ArcelorMittal) సంస్థ తొలి అడుగు వేసింది. రూ. లక్ష కోట్లతో ఈ ఫ్యాక్ట‌రీని స్థాపించ‌నుంది. దీని కోసం ఓ పోర్టును కూడా ఆ సంస్థ నిర్మించనుంది. ఇందుకు

ArcelorMittal

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఉక్కు కర్మాగారం (integrated sintegrated steel plant) స్థాపించేందుకు ఆర్సెలర్‌మిట్టల్ (ArcelorMittal) సంస్థ తొలి అడుగు వేసింది. రూ. లక్ష కోట్లతో ఈ ఫ్యాక్ట‌రీని స్థాపించ‌నుంది. దీని కోసం ఓ పోర్టును కూడా ఆ సంస్థ నిర్మించనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh government) ఆర్సెలర్‌మిట్టల్ సంస్థ విశాఖ‌ప‌ట్నంలోని న‌క్క‌ప‌ల్లి స‌మీపంలో మూడు కిలోమీటర్ల సముద్రతీరాన్ని, 2,200 ఎకరాల భూభాగాన్ని కేటాయించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ArcelorMittal : మంత్రి నారా లోకేష్ జోక్యం

ఈ పోర్ట్ నిర్మాణం కోసం ముందుగా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కేజీపీఎల్ ట్విన్-పోర్ట్ సెజ్‌ కాంప్లెక్స్ ప్రస్తుతం అర‌బిందో గ్రూప్ (Aurobindo Group) ఆధీనంలో ఉంది. 25 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయినా రంబిల్లి నావల్ బేస్ వరకు ప్రత్యేక హక్కులు కొనసాగాయి. తద్వారా ఇతర సంస్థలు ఇక్కడ ప్రాజెక్టులను చేపట్టడం కష్టమైంది. ఈ పరిస్థితిని అధిగ‌మించేందుకు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) జోక్యం చేసుకున్నారు. అర‌బిందో సంస్థను ఒప్పించడంతో అడ్డంకులు తొల‌గిపోయాయి.

700 ఎక‌రాల కేటాయింపు

అర‌బిందో సంస్థ ప్రతిపాదించిన బల్క్ డ్రగ్ పార్క్ నుంచి ఆర్సెలర్‌మిట్టల్ సంస్థ (ArcelorMittal Company) 700 ఎక‌రాల భూమిని తీసుకొని ఆర్సెలర్‌మిట్టల్ ఉక్కు కర్మాగారానికి కేటాయించేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించింది. మొత్తం 2,200 ఎకరాల భూమిని కర్మాగారానికి కేటాయించనున్నారు. ప్రతి ఎకరాకూ రూ.50 లక్షల ధరను నిర్ణ‌యించారు.

55 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు

కర్మాగారం తొలి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమవుతుంది. రెండో దశలో ఇది 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది. మొత్తం పెట్టుబడి తొలి దశలో రూ.55 వేల కోట్లు, రెండో దశలో రూ.80 వేల‌ కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో 20 వేల‌ మంది, రెండో దశలో 35 వేల‌ మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. కర్మాగారం కోసం 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్వీయ వినియోగ పోర్ట్‌ను నిర్మించేందుకు సంస్థ రూ.10 వేల‌ కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలు మెరుగు ప‌డ‌టానికి కీల‌కంగా మార‌నుంది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల మధ్య సమన్వయం, ప్రాజెక్టు విజయవంతానికి మార్గం సుగమం చేసింది. త‌ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి బాట‌లు ప‌డ‌నున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!