Sarkar Live

Ashok Leyland | ఏపీలో మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌.. రానున్న‌ బ‌స్సుల తయారీ కేంద్రం

Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మ‌రో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత

Ashok Leyland

Ashok Leyland : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మ‌రో భారీ పరిశ్రమ రాబోతోంది. విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ఆధునిక బస్సు తయారీ కేంద్రం (bus manufacturing plant) ఏర్పాటు కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత ముందుకు వెళ్లనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. నైపుణ్య అభివృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు.

ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిలో మరో ముంద‌డుగు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నామ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక ప్రతిష్టాత్మక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాన‌ని చెప్పారు. ఇప్పుడు అశోక్ లేలాండ్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల అభివృద్ధికి మరో ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Ashok Leyland : మెరుగుప‌డున్న ఉద్యోగావ‌కాశాలు

ఈ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు కూడా ఆకర్షితమయ్యే అవకాశం ఉందని, దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. విజయవాడ (Vijayawada) సమీపంలో ఏర్పాటవుతున్న ఈ బస్సు తయారీ కేంద్రం రాష్ట్రానికి మేలును చేయనుందని, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుందని తెలిపారు.

ప‌ర్యావ‌ర‌ణ హిత ర‌వాణా

ఈ ప్రాజెక్ట్ వల్ల రవాణా రంగం ( public transport)లో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలో రూపొందించనున్న ‘స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు’ రాష్ట్ర పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని చెప్పారు. ఈ బస్సులను కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా రూపొందించనున్నార‌ని తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రాజెక్ట్‌గా నిలవనుందని, ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో నాయకత్వం వహించే అవకాశం ఉందని అన్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా తయారయ్యే బస్సులు దేశ వ్యాప్తంగా సరఫరా కానున్నాయని, రాబోయే రోజుల్లో ఇవి అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఎగుమతి అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఉపాధి ల‌భించే అవ‌కాశం

ఈ ప్రాజెక్ట్ (Ashok Leyland) వల్ల స్థానిక కూలీలకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వారికి మంచి శిక్షణ ఇచ్చి అధునాతన సాంకేతికతను నేర్చుకునే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ పరిశ్రమ స్థాపనతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధిలో మరో కీలక అడుగు వేసినట్లు అవుతుందని, దీని వల్ల మరిన్ని పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. పరిశ్రమల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటమే కాకుండా, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల కేంద్రంగా మారేందుకు ఇది సహాయపడుతుందని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!