Sarkar Live

Author: SreeRam

శ్రీరామ్ వెన్ను గారికి పదిహేను సంవత్సరాలకు పైగా జర్నలిజంలో అనుభవం ఉంది. ప్రముఖ పత్రికలు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులలో పనిచేసారు. రాము వెన్ను వెబ్ సైట్ రూపకల్పన మరియు కంటెంట్ జనరేషన్ లలో నిష్ణాతులు.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao
Crime

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao

Mallojula Venugopal Rao : మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అడ‌వి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. సీఎం స‌మ‌క్షంలో వీరు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ న‌ష్టంగా భావిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరితో అసంతృప్తి వ్య‌క్తంచేస్తూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని విప్ల‌వోద్య‌మాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డ...
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. తొలిరోజు నామినేషన్లు ఎంతంటే.. – Jubilee Hills By Election
State, Hyderabad

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. తొలిరోజు నామినేషన్లు ఎంతంటే.. – Jubilee Hills By Election

Jubilee Hills By Election | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం రాష్ట్ర‌ ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీక‌రించనున్న‌ట్లు ఎన్నికల సంఘం వెల్ల‌డించింది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉప సంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్‌ వచ్చే నెల 11న పోలింగ్‌, 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరించ‌నున్నారు. కార్యాలయంలో నేరుగా లేదా ఆన్‌లైన్‌ విధానంలో దాఖలు చేసే వీలు క‌ల్పించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అధికారులు వెల్లడించారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలన...
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం – BC Reservation Stay
Trending

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం – BC Reservation Stay

Hyderabad | బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప్రభుత్వ ఉత్తర్వు (GO) 9… పై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేయాలనే ఉద్దేశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లకు (BC Reservation) సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేయ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిష్కారం కోసం ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది. హైకోర్టు తీర్పును క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత, అధికారులు తమ వాదనలను సమర్పించడానికి సీనియర్ న్యాయవాదిని నియమించుకోవాలని నిర్ణ‌యించారు. ముఖ్యంగా, రిజర్వేషన్ల రంగంలోని న్యాయ నిపుణులు, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే వంటి వారు ఈ విషయంలో ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని భావిస్తున్నారు. రిజర్వేషన్లకు అవసరమైన "ట్రిపుల్ టెస్ట్"...
Nobel Peace Prize 2025 :   వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
World

Nobel Peace Prize 2025 : వెనిజులా నాయకురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

Nobel Peace Prize 2025 : 2025 సంవ‌త్స‌రానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల చెదిరిపోయింది. వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడో (Maria Corina Machado) కు ఈ గౌరవం లభించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె అవిశ్రాంత పోరాటం చేసినందుకు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి పుర‌స్కారం లభించింది. వెనిజులాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మార‌డానికి ఆమె నాయకత్వం, పోరాటాన్ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఆమె ప్రయత్నాలను "ప్రజాస్వామ్య విలువల ప్రపంచ రక్షణకు చిహ్నం"గా నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఇది డోనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోవాలనే కలను చెదరగొట్టింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగించారు. "ఆమె ప్రాణాలకు తీవ్రమైన బెద...
TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…
State, Hyderabad

TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…

ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు… TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ ద...
error: Content is protected !!