Sarkar Live

Crime

Accident |  జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
Crime

Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండ‌గా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య...
Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం
Crime

Son kills mother | కొడుకు చేతిలో త‌ల్లి హ‌తం.. మ‌ద్యం మ‌త్తులో ఉన్మాదం

Son kills mother : రంగారెడ్డి జిల్లా చెవెళ్ల (Chevella)లో జరిగిన దారుణ సంఘటన క‌ల‌కలం రేపింది. మద్యం మత్తులో ఓ వ్య‌క్తి క‌న్నత‌ల్లిని కొడ‌వ‌లితో దాడి చేసి హ‌త‌మార్చాడు. ఆ తర్వాత గ్రామస్థులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చెవెళ్ల‌ మండలంలోని రెగడఘనపూర్ గ్రామం (Regadghanapur)లో నివసిస్తున్న జంగయ్య తన తల్లి నర్సమ్మ (75)తో కలిసి ఉండేవాడు. మద్యం మత్తులో అత‌డు తల్లితో ఏదో ఒక విష‌యంపై వాగ్వాదానికి దిగాడు. కొద్ది సేపటికే అత‌డు మ‌రింత కోపోద్రిక్తుడై విచ‌క్ష‌ణ కోల్పోయి ఉన్మాదిగా మారాడు. ఇంట్లోనే ఉన్న కోడవలిని తీసి త‌ల్లిపై దాడి చేసి (attacking) అత్యంత కిరాత‌కంగా గాయ‌ప‌ర్చాడు. దీంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘటన శనివారం రాత్రే జరిగినప్పటికీ ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నర్సమ్మ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జంగయ్యను పట్టుకొని చెట్...
vaccination| వ్యాక్సిన్ వేయ‌గానే శిశువు మృతి
Crime

vaccination| వ్యాక్సిన్ వేయ‌గానే శిశువు మృతి

Boy dies after vaccination : వాక్సిన్ తీసుకున్నగంట వ్య‌వ‌ధిలోనే నాలుగు నెల‌ల శిశువు మృతి చెందిన (boy dies) సంఘ‌ట‌న కరీంనగర్ జిల్లా జ‌మ్మికుంట (Jammikunta) మండ‌లం పాప‌క్క‌ప‌ల్లిలో క‌ల‌క‌లం రేపింది. టీకా ప్రభావమేనా లేక వేరే కారణమా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ్యాక్సిన్ (vaccine) వ‌ల్లే త‌మ బిడ్డ మృతి చెందాడ‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తుండ‌గా వైద్యులు మాత్రం కార‌ణం అది కాద‌ని అంటున్నారు. ఇత‌ర అనారోగ్య కార‌ణం వ‌ల్ల శిశువు మృతి చెంది ఉండొచ్చ‌ని వాదిస్తున్నారు. పాపక్కపల్లి గ్రామానికి చెందిన లింగాల అంజి, హర్షిత దంపతులు తమ నాలుగు నెలల బిడ్డను వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. శిశువుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం అక్క‌డి వైద్య సిబ్బంది RVV-2 (రోటా వైరస్ వ్యాక్సిన్), Penta-2 (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్-బి, Hib కలిపిన టీకా) వేశారు. ఈ టీకాలు సాధారణంగా శిశువు...
Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువ‌కుడు మృతి
Crime

Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువ‌కుడు మృతి

Mahabubnagar : అమెరికా (United States)లో జరిగిన ఓ ఘ‌ట‌న‌లో మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన యువకుడు పోలీసుల కాల్పుల కు గురై ప్రాణాలు (shot dead) కోల్పోయాడు. 15 రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ అతడి స్నేహితులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది.మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ (34) 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. చదువులు పూర్తయ్యాక కాలిఫోర్నియా (California)లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నలుగురితో క‌లిసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకొని నివ‌సిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రూమ్‌మేట్స్‌తో విభేదాలు ఉధృతమై చివరికి ప్రాణాంతక పరిణామానికి దారితీశాయి. రూమ్‌మేట్స్‌తో వాగ్వాదం.. పోలీసుల కాల్పులు కాలిఫోర్నియా (California) మీడియా కథనాల ప్రకారం.. నిజాముద్దీన్, అతడి రూమ్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జ...
Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు
Crime

Wanaparthy | ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారులు

Wanaparthy District : మ‌రో ఇద్ద‌రు అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారుల‌కు చిక్కారు. వ‌న‌ప‌ర్తి జిల్లా (Wanaparthy) కొత్తకోట మండలం నీర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్సీ కోసం ఆర్డీవో (RDO)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆర్డీఓ కొత్తకోట ఎమ్మార్వోకు పంపారు. దీంతో తహసీల్దార్ ఇనాం భూములకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఎమ్మారై వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్ద‌రు సదరు రైతు నుంచి రూ.40 వేలు ఇస్తేనే ప‌నిచేసి పెడ‌తామ‌ని చెప్పారు. స‌ద‌రు రైతు అంత‌పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇవ్వ‌లేని మొర‌పెట్టుకున్నా వారు విన‌లేదు.దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంట‌నే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి డిమాండ్‌ చేసినట్లు ఆధారాలను సే...
error: Content is protected !!