Sarkar Live

Crime

Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి
Crime, Mahaboobnagar

Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి

Mahbubnagar Bus Accident : మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ట్రైలర్ ట్రక్కును ఒక ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదం (Accident) లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. 32 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గ‌ణేష్ ఊరేగింపులో.. West Godavari Accident : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో గణేష్ ఊరేగింపు సందర్భంగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి, ఒక మైనర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గణేష్ ...
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case
Crime, Hyderabad

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case

Hyderabad Murder Case : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. ఓ మహిళ ప్రియుడి మోజులో ప‌డి కలిసి క‌ట్టుకున్న భర్త‌నే అంత‌మొందించింది. పైగా నిద్రలో చనిపోయాడంటూ స్థానికులను, పోలీసులను నమ్మించేందుకు య‌త్నించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విస్తుగొలిపే విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ (NagarKarnool) జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి (Rangareddy ) జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహమైంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. శేఖ‌ర్ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌ (Hyderabad) సరూర్ నగర్ (SaroorNagar) లోని కోదండరామనగర్‌కు వలస వచ్చింది. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. చిట్టి బ‌ట్ట‌ల షాపులో పని...
Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం
Crime, Mahaboobnagar

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం

Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మ‌హిళ త‌న‌ కూతురిని చంపి, ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రేబిస్‌ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకింద‌ని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....
Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం
Crime, Nizamabad

Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం

Nizamabad : నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని గౌతమ్ నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరాలో తనకు పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మహిళ బంధువులకు ప్రసాద్‌కు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి గొడ‌వ‌ పెద్దది కావడంతో ఒక‌రికొక‌రు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి స్నేహితుడు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంట హత్యలతో గ్రామం ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రసాద్‌పై అనేక చోరీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణ...
సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case
Crime

సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case

Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్త‌వాలు మీడియాకు వెల్ల‌డించారు. 14 ఏళ్ల పిల్లాడే త‌న ఇంటి ప‌క్క‌న ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయ‌న క‌థ‌నం ప్ర‌కారం.. సహస్ర తమ్ముడితో త‌ర‌చూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వ‌ద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే స‌హ‌స్ర‌ ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే స‌మ‌యంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంట‌నే స‌ద‌రు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగ‌కుండా కత్తితో పాశ‌వికంగా పొడిచేశాడని పోలీసులు వెల్ల‌డించారు. మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్...
error: Content is protected !!