Sarkar Live

Crime

ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
Crime, Karimnagar

ACB Arrest | రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ACB Arrest | పెద్దపల్లి జిల్లా(Peddapalli)లో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు నుంచి భూమి సర్వే చేసిన రిపోర్టు ఇవ్వడానికి సర్వేయర్ భారీగా లంచం డిమాండ్‌ చేశాడు. అందుకు ఆ రైతు కొంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.10,000 ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ద్వారా మండల సర్వేయర్ పైండ్ల సునీల్ అకౌంట్ కు బదిలీ చేయగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పైండ్ల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10,000 లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఓ రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి రూ.10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వ...
ACB Raids | ఏసీబీ దాడులు..  రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌
Crime, Adilabad

ACB Raids | ఏసీబీ దాడులు.. రూ.6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్‌ అసిస్టెంట్‌

ACB Raids in Mancherial | మంచిర్యాల జిల్లాలో ఏసీబీ(ACB) వలకు మరో అవినీతి చేప చిక్కింది. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం .. కోటపల్లి మండలం అంగరాజుపల్లి పీహెచ్‌సీలో ఇన్‌చార్జి జూనియర్ అసిస్టెంట్‌గా (Junior Assistance) విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్ అనే వ్యక్తి అదే శాఖలో పని చేస్తున్న వ్యక్తి కి సంబంధించిన డీఏ ( DA ) నిధుల విడుదల చేసేందుకు రూ.6 వేలను లంచంగా డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంచిర్యాలలో బొమ్మరిల్లు హోటల్ వద్ద రూ.6 వేల లంచం తీసుకుంటుండగా పక్కా ప్లాన్ తో పట్టుకున్నట్లు వెల్లడించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అం...
Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య
Crime

Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య

Janagama : జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్య (Murder )కు గురికావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. జఫర్‌గఢ్‌ మండలం తుమ్మడపల్లి ఐ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....
సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు..  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter
Crime

సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter

Sitapur Encounter : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్‌పాయ్ హత్య కేసులో ఇద్దరు నేరస్థులను పోలీసులు కాల్చి చంపారు . నివేదికల ప్రకారం, రాజు అలియాస్ రిజ్వాన్, సంజయ్ అలియాస్ అకీల్‌గా గుర్తించబడిన ఇద్దరు దుండగులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), క్రైమ్ బ్రాంచ్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మరణించారు. పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లాపూర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ హత్య జరిగినప్పటి నుండి ఇద్దరూ పరారీలో ఉన్నారు మరియు వారిపై ఒక్కొక్కరికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. రాఘవేంద్ర బాజ్‌పేయి హత్య కేసు ఉత్తరప్రదేశ్​లోని​ సీతాపూర్‌కు చెందిన జర్నలిస్ట్ రాఘవేంద్ర వాజ్‌పేయి మార్చి 8న హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆ రోజు...
రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids
Crime

రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids

ACB Raids in Jagtial district : జగిత్యాల జిల్లాలో అవినీతి కేసు కలకలం సృష్టించింది. జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న భద్రు నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ బుధవారం జగిత్యాల జిల్లా రవాణా అధికారి బానోత్ భద్రు నాయక్‌ను అతని కార్యాలయంలో అరెస్టు చేసింది. ఆయన తన ప్రైవేట్ డ్రైవర్ బానోత్ అరవింద్ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ.22,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. కేసు నమోదు చేయకుండా ఉండటానికి, అతని ప్రొక్లయినర్ వాహనానికి జరిమానా విధించకుండా ఉండటానికి మరియు ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్‌లను విడుదల చేయడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు లంచం డిమాండ్ చేశారు. అరవింద్ వద్ద నుండి రూ.22,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రసాయన పరీక్షలో అరవింద్ కుడి చేతి వేళ్లు సానుకూల ఫలితాలను ఇచ్చాయని, నాయక్...
error: Content is protected !!