Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య
Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జరిగిన దారుణ హత్య సంఘటన అందరినీ భయాందోళనకు గురిచేసింది. బైక్పై వెళ్తున్న ఓ రౌడీషీటర్ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో శ్రీనిధి మార్ట్ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్కసారిగా మీదపడిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంటనే అదే అదే కారులో అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ దృశ్యాలన్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ...


