Sarkar Live

Crime

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం
Crime, Mahaboobnagar

Rabies Fear | కూతురిని హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన తల్లి.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో విషాదం

Mahbubnagar | కూతురికి రేబిస్ (Rabies) సోకిందన్న అనుమానంతో ఓ మ‌హిళ త‌న‌ కూతురిని చంపి, ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. యశోద అనే గృహిణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రేబిస్‌ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు.. కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త..! అంటూ యశోద చాక్ బోర్డు, డోర్ల మీద రాసింది. రేబిస్ వాక్సిన్ (Rabies Vaccine) తీసుకున్నప్పటికీ.. అది వ్యాక్సిన్‌తో తగ్గదు, చెట్ల మందు తీసుకోవాలి, పత్యం చేయాలని భర్త నరేష్‌కు పలు రకాలుగా విన్నవించింది. తనకు, తన కూతురుకి రేబిస్ వ్యాధి సోకింద‌ని అందోళన చెందింది. అదే అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది....
Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం
Crime, Nizamabad

Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం

Nizamabad : నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని గౌతమ్ నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరాలో తనకు పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మహిళ బంధువులకు ప్రసాద్‌కు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి గొడ‌వ‌ పెద్దది కావడంతో ఒక‌రికొక‌రు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి స్నేహితుడు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంట హత్యలతో గ్రామం ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రసాద్‌పై అనేక చోరీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణ...
సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case
Crime

సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case

Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్త‌వాలు మీడియాకు వెల్ల‌డించారు. 14 ఏళ్ల పిల్లాడే త‌న ఇంటి ప‌క్క‌న ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయ‌న క‌థ‌నం ప్ర‌కారం.. సహస్ర తమ్ముడితో త‌ర‌చూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వ‌ద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే స‌హ‌స్ర‌ ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే స‌మ‌యంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంట‌నే స‌ద‌రు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగ‌కుండా కత్తితో పాశ‌వికంగా పొడిచేశాడని పోలీసులు వెల్ల‌డించారు. మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్...
Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం
Crime

Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం

Suryapet news | సూర్యాపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను హత్య చేయడానికి దుండగులు కారులో వెంబడించారు. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం సమీపంలోని ఓ వైన్స్ ముందు తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి శుక్రవారం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు బైక్ బయటపడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లారు. బైక్ ను వెంబడిస్తూ వస్తున్న దుండగులు కారు నుంచి దిగి ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో వైన్స్ షాప్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చ...
Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌
Crime

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌

Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారుల‌కు ఏసీబీ చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌తో అక్ర‌మార్కును హ‌డ‌లెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివ‌ర‌కు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్‌ లంచం తాలూకు డ‌బ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ...
error: Content is protected !!