Sarkar Live

Crime

Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే  పారిపోయిన పంచాయతీ కార్యదర్శి
Crime

Telangana ACB | రూ.లక్ష లంచం.. ఏసీబీ అధికారులు పట్టుకునేలోపే పారిపోయిన పంచాయతీ కార్యదర్శి

Telangana ACB Raids | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఇన్ములనర్వ గ్రామ పంచాయతీ (Panchayat Secretary) కార్యదర్శి సురేందర్‌ (Surendar)పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ఓ నిర్మాణంపై ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ.50 వేలు లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే యత్నించగా నిందితుడు సురేందర్ పరారయ్యాడు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌లోని ఇండియానా హోటల్ సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల మొత్తాన్ని సురేందర్ స్వీకరించి తన ఎస్‌యూవీ కారులో సంఘటనా స్థలం నుంచి చందానగర్ లోని తన అపార్ట్మెంట్ వెళ్లాడు. తన కారు తన ఇంటి వద్ద నిలిపి తన బావమరిది కారు తీసుకొని అతనికి లంచం డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఏసీబీ అధికారులు కారును, లంచం తాలుకు నగదు ...
ACB Raids | రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్​
Crime

ACB Raids | రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్​

ACB Raids in Hyderabad | హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి.. కేవలం డబ్బుపై ఆశతో లంచం తీసుకుంటుగా ఏసీబీ అతడిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్ (Rajendranagar) మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కె. రవికుమార్‌ ఓ హోటల్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయనను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ (Deputy Commissioner) కె రవికుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మున్సిపల్‌ పరిధిలోని ఒక హోటల్‌లో ఇటీవల మున్సిపల్‌ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్‌లో అపరిశుభ్రంతో పాటు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు హోటళ్లపై దాడులు...
Fire Accident | హైదరాబాద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Crime

Fire Accident | హైదరాబాద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident ) చోటుచేసుకుంది. కెమికల్ రియాక్షన్ కారణంగా ద‌ట్టమైన పొగ‌లు చిమ్ముకుటూ మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను చూసి సమీప తండాల్లో ఉంటున్న ప్రజలు భయాందోళ‌తో ప్రాణాల‌ను అర‌చేతిలోపెట్టుకొని పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటన్నది తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు....
ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌
Crime

ACB | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌

హైదరాబాద్‌లో పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం ఏసీబీ (ACB ) వలకు చిక్కారు. డీఈని బదిలీ చేసేందుకు కనకరత్నం రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. సరిగ్గా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ...
Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..
Crime

Yadadri | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం..

Yadadri Bhuvanagiri News | వివాహేతర సంబంధం ఓ ప‌చ్చ‌ని సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది. తన వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా మారాడన్న కోపంతో భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం క‌ట్టుకున్న‌ భర్తను అంత‌మొందించింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసినా… చివరికి పోలీసుల విచార‌ణ‌తో కుట్ర బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘాతుకం అంద‌రినీ తీవ్రంగా కలిచివేసింది. పోలీసులు, స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి (38) ను మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి స్వగ్రామంలోనే ఉంటూ భువనగిరిలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షో రూంలో పనిచేస్తోంది. ఈ ...
error: Content is protected !!