Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
Hyderabad News | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ రామంతాపూర్లో (Ramanthapur) అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtami ) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో యువకులు వాహనాన్ని నిలిపివేసి చేతులతో లాగుతూ ముందుకు కదిలించారు. ఈ క్రమంలోనే విద్యుత్ తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొందరు సీపీఆర్ చేసేందుకు యత్నించినా ప్రాణాలు నిలవలేదు.
మరో నలుగ...




