Sarkar Live

Crime

Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు
Crime

Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు

Micro Finance loan : అప్పు ఆ కుటుంబానికి ముప్పు తెచ్చి పెట్టింది. రుణం ఇచ్చిన సంస్థ దారుణానికి ఆ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. మైక్రో ఫైనాన్స్ వేధింపుల‌కు భార్యాభ‌ర్త‌లు బ‌లి అయ్యారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చేసుకొని పిల్ల‌ల‌ను అనాథ‌లు చేశారు. పది రోజుల వ్య‌వ‌ధిలోనే దంప‌తులిద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. వారం వారం చెల్లింపులతో క‌ష్టాలు భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన బానోత్‌ దేవందర్‌ (37), చందన (32) అదే గ్రామంలో కూలి ప‌ని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. చాలీచాల‌ని దిన‌స‌రి వేత‌నంతో వీరికి కుటుంబ పోష‌ణ భార‌మైంది. దీంతో మైక్రో ఫైనాన్స్‌లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు వారం వారం కిస్తీలు క‌ట్టాల్సి ఉండ‌గా, కొన్ని రోజుల త‌ర్వాత చెల్లింపులు వీరికి క‌ష్ట‌త‌ర‌మైంది. ఒక‌రి త...
Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..
Crime

Constables : ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుల్స్ సూసైడ్..

ఒకరు ఉరి వేసుకోగా, మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య పొలీస్ శాఖలో కలకలం రేపుతున్న వరుస ఘటనలు TG Police : ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య (Police Constables )కు పాల్పడ్డారు. ఒకరేమో మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా, మరొకరేమో బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు. వీరిరువురు ఈ రోజు ఉదయం వేర్వేరు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొల్చారం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయికుమార్ క్వార్టర్స్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బెటాలియన్ లో కానిస్టేబుల్ గా ఉన్న బాలకృష్ణ కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చనిపోగా అతని భార్య తోపాటు ఇద్దరు చిన్న పిల్లల ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఆత్మహత్య లు కలకలం...
Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్..  క్రైం రేట్ తగ్గించేశారు..
Crime

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్.. క్రైం రేట్ తగ్గించేశారు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్‌ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు...
Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..
Crime

Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..

Accident in Madhapur : హైద‌రాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) లో హోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇద్ద‌రు యువకులు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ డివైడ‌ర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇద్ద‌రూ ప్రాణాలు వ‌దిలారు. డివైడ‌ర్‌కు ఢీకొన‌డంతో బైక్ నుంచి మంట‌లు రావ‌డం ఈ ప్ర‌మాద తీవ్ర‌త‌ను సూచిస్తోంది. బైక న‌డిపేట‌ప్పుడు హెల్మెంట్ ధ‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ దృశ్యాల‌ను సీసీ కెమెరాల్లో (CCTV footage ) న‌మోద‌య్యాయి. భ‌యాన‌క దృశ్యం హైద‌రాబాద్‌లోని బోర‌బండాకు చెందిన ర‌ఘుబాబు (29) ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ((Software Company))లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (27) ఐటీ రంగంలో కొత్త‌గా చేరాడు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. వారిని చివ‌రిసారి ఓ బార్‌షాపులో చూసిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. శుక్ర‌వారం రాత్రి వీర‌ద్దరూ బైక్‌పై బ‌య‌ల్దేరారు. మ‌ద్యం మ‌త్తు ద్విచ‌క్రవాహ‌నాన్ని అతివేగంగా న‌డ‌ప‌డంతో...
Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..
Crime

Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..

Lucknow bank heist | లక్నో బ్యాంకు దోపిడీ కేసులో కీల‌క పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్ర రాజధాని, ఘాజీపూర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు కీలక నిందితులను హతమార్చారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి చెందిన 42 లాకర్లను పగులగొట్టి కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను ముఠా సభ్యులు దోచుకెళ్లారు (Bank Loot ). ఈ క్ర‌మంలో పోలీసులు పలుచోట్ల ఎన్‌కౌంట‌ర్లు చేప‌ట్ట‌గా ఇద్ద‌రు హ‌తమ‌య్యారు. Lucknow Encounter : లక్నోలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌లో పోలీసులకు, నిందితులకు మధ్య జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో నిందితుడు సోబింద్ కుమార్ (29) హతమయ్యాడు. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఘాజీపూర్‌లో రెండో ఎన్‌కౌంటర్ ఉత...
error: Content is protected !!