వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి
Accident | గజ్వేల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టి పోయింది .దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికక్కడే మృతిచెందారు.
కాగా మృతుడు పరందాములు స్వగ్రామం సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు కాగా, వెంకటేశ్ స్వగ్రామం గాడిచర్లపల్లి. మృతులు వెంకటేష్, పరంధాములు ప్రస్తుతం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి ...




