Sarkar Live

AndhraPradesh

Abortion in Telangana | తెలంగాణ‌లో పెరుగుతున్న అబార్ష‌న్లు.. ఐదేళ్ల‌లో 10 రెట్లు పెరుగుద‌ల‌
State, AndhraPradesh

Abortion in Telangana | తెలంగాణ‌లో పెరుగుతున్న అబార్ష‌న్లు.. ఐదేళ్ల‌లో 10 రెట్లు పెరుగుద‌ల‌

Abortion in Telangana : తెలంగాణలో పెరుగుతున్న అబార్ష‌న్ల (abortions) సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తోంది. 2024-25లో రాష్ట్రంలో మొత్తం 16,059 అబార్ష‌న్లు న‌మోద‌య్యాయి. 2020-21లో ఉన్న గణాంకాలతో పోలిస్తే ఇది పది రెట్లు పెరుగుదల అని ఆరోగ్య శాఖ లెక్క‌లు చెబుతున్నాయి. ఇదే క్ర‌మంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా అబార్ష‌న్ల (abortions) సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2020-21లో కేవలం 2,282 కేసులు ఉండగా, 2024-25లో ఈ సంఖ్య 10,676కు చేరింది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంట్‌లోని వర్షాకాల సమావేశం ( Parliament’s monsoon session)లో వెల్లడించింది. అత్యధికంగా న‌మోద‌వుతున్న రాష్ట్రాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) డేటా ప్రకారం 2024-25లో అత్యధికంగా అబార్ష‌న్లు జరిగిన రాష్ట్రాలు ఇవి: మహారాష్ట్ర : 2,07,019 తమిళనాడు : 1,01,41...
Rain Alert |  మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు
State, AndhraPradesh

Rain Alert | మ‌రో మూడు రోజులు భారీ వ‌ర్షాలు

IMD Rain Alert to Telangana and AP : బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి, కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. మ‌రోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న (బుధవారం) అల్పపీడనం ఏర్పడుతుందని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక విష‌యాల‌ను వెల్ల‌డించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందాఇ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని 13 జిల్లాలకు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, హన్మ‌కొండ‌, వరంగల్‌, ములుగు, మ...
Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..
AndhraPradesh

Kadapa | ఇంట‌ర్ విద్యార్థిని హ‌త్య‌లో ట్విస్ట్‌..

Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియ‌ట్‌ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్య‌మైన‌ ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గ‌త‌ సోమవారం క‌ళాశాల‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేప‌ట్ట‌గా గండికోటలో విద్యార్థిని మృతదేహం ల‌భ్య‌మైంది.. వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada
State, AndhraPradesh

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు. విజయవాడ అభివృద్ధికి "మంచినీటి ప్రవాహంలా" నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు. అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ₹150 కోట్లు ప్రకటించినప్పటికీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని పౌర సమస్యలను పరిష్కరి...
error: Content is protected !!