Hyderabad : మాకు ఎవరి జోక్యం అవసరం లేదు.. ట్రంప్పై రాజ్నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh
Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవడం వల్లే భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్యలను రాజ్నాథ్ ఖండించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదంపై తన సొంత నిర్ణయాలతో చర్యలు తీసుకుంటుంది. ఎవరి జోక్యం అసవరం లేదని స్పష్టం చేశారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లిబరేషన్ డే (Hyderabad Liberation Day)ను ప్రతి సంత్సరం నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్నాథ్సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇండో-పాక్ సంబంధాలపై కీలక...




