Sarkar Live

Hyderabad

ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops
State, Hyderabad

ఆవుకు అంత్య‌క్రియలు.. శ‌భాష్ అనిపించుకున్నపోలీసులు – Hyderabad Traffic Cops

Cow’s Last Rites: హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Cops) త‌మ సామాజిక బాధ్య‌త‌ను (social responsibility) చాటుకున్నారు. మృతి చెందిన ఆవుకు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అంత్యక్రియ‌లు (Cow’s Last Rites) నిర్వహించారు. ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వెస్లీ, మొబైల్ కానిస్టేబుల్ టి. సురేష్ డ్యూటీలో ఉన్న సమయంలో బోయిన్‌పల్లి సెంట‌ర్‌లో రోడ్డుపై చ‌నిపోయి ఉన్న ఆవు కనిపించింది. దీంతో వారిద్ద‌రు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ట్రాఫిక్‌ను క్ర‌బ‌ద్ధీక‌రించారు. సొంత ఖ‌ర్చుతో అంత్య‌క్రియ‌లు పోలీసులు కాంటోన్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతో జేసీబీ ఏర్పాటు చేశారు. అనంతరం ఆవు మృతదేహాన్ని త్రిముల్‌ఘెర్రీలోని గాంధీ కమ్యూనిటీ హాల్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద గుంత తవ్వించి సమాధి చేశారు. ఈ అంత్యక్రియల (final rites)కు సంబంధించిన ఖర్చును స్వయంగా ఆ ఇద్దరు అధికారులే భరించారు. Hydera...
Hyderabad | వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గ‌ల్లంతై యువ‌కుడి మృతి
State, Hyderabad

Hyderabad | వ‌ర‌ద‌ ప్ర‌వాహంలో గ‌ల్లంతై యువ‌కుడి మృతి

Hyderabad rains : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం మరో ప్రాణాన్ని బలిగొంది. ముషీరాబాద్‌కు చెందిన యువ‌కుడు నిన్న అర్ధరాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గాలింపు అనంతరం అతడి మృతదేహాన్ని ఈరోజు ఉదయం బాల్కంపేట్ రైల్వే అండర్‌బ్రిడ్జ్ వద్ద పోలీసులు గుర్తించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే.. బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో షరీఫుద్దీన్ (27) తన బైక్‌పై బాల్కంపేట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లు మొత్తం నీళ్లు ముంచెత్తాయి. బలమైన నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక వాహనం సహా ష‌రీఫ్ కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టినా ఆచూకీ ల‌భించ‌లేదు. చివరికి గురువారం ఉదయం అతడి మృతదేహం బాల్కంపేట్ అండర్‌పాస్ దగ్గర లభించింది. Hyderabad లో వ‌ర్ష‌పాతం ఇలా.. బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంపై ఒక్కసారిగా భారీ వర్షం కు...
Rains | నగరంలో మరోమారు భారీ వర్షం
State, Hyderabad

Rains | నగరంలో మరోమారు భారీ వర్షం

Hyderabad Rains | హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, అ‌మీర్‌పేట్‌, ‌జూబ్లీహిల్స్, ‌సనత్‌నగర్‌, ‌కృష్ణానగర్‌, ‌మియాపూర్‌, ‌చందనాగర్‌, ‌మాదాపూర్‌, ‌రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్‌ ‌బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, ఇబ్బందులు ప‌డ్డారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. అర్‌పేట, బంజారాహిల్స్ ‌తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్, ‌ఫిల్మ్‌నగర్‌, ‌యూసుఫ్‌గూడ, అర్‌పేట్‌, ‌పంజాగుట్ట, మాదాపూర్‌ ‌తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్‌...
బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party
State, Hyderabad

బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party

Teenmar Mallanna New Party : తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఈరోజు స్థాపించారు. త‌న పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party -TRP) పేరు పెట్టారు. బుధ‌వారం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తీన్మార్ మ‌ల్ల‌న్న‌ వెల్ల‌డించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి బిగించిన చేయి, దాని చుట్టూ ఆలీవ్ ఆకులు ఉన్నాయి. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అని రాసి ఉంది. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) ఈసంద‌ర్భంగా తెలిపారు. ‘తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆ...
Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..
State, Hyderabad

Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్టు (Bharat Future City)పై వెనుక‌డుగు వేసేది లేద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి (development of the State)కి ఇది త‌ప్ప‌నిస‌రి అన్నారు. రైతుల నిర‌స‌న‌ల పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్ల‌ను ఇవ్వాలని నోటిఫై చేసిన గ్రామాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ (Hyderabad)లో ఈ రోజు జ‌రిగిన తెలంగాణ ప్ర‌జా ప‌రిపాల‌న దినోత్స‌వం (Telangana Praja Palana Dinotsavam) సంద‌ర్భంగా సీఎం త‌న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై మ‌రోసారి మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే ప్ర‌తిప‌క్షాల ఉద్దేశం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల (opposition parties) ప్రేరేపించ‌డం వల్లే జరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి రేవంత్‌...
error: Content is protected !!