Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు
Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధవారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులకు కీలక సూచనలు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గతేడాది కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసారి చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్దం చేసినట్లు మత్స్యశాఖ అధికారులు మంత్రికి తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. క్యూ లైన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన...




