Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..
Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు చేరుకున్నారు. సీలింగ్ కూలిపోవడానికి తీవ్రమైన గాలి దుమారమే ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు జీఎంకు వివరించారు.
ఇక చర్లపల్లి స్టేషన్ లో గాలి దుమారానికి దెబ్బతిన్న ఇతర ప్రాంతాలను జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain) పరిశీలించారు. అనంతరం జీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీలింగ్ ధ్వంసమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్...




