Sarkar Live

State

Revanth Reddy meets PM Modi |  హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!
State

Revanth Reddy meets PM Modi | హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!

Revanth Reddy meets PM Modi : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) దేశ రాజ‌ధాని ఢిల్లీకి బుధ‌వారం బ‌య‌ల్దేరారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి (Andhra Pradesh Reorganisation Act) సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి వివరించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Revanth Reddy meets PM Modi : టన్నెల్ ప్రమాదంపై చర్చ ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం గురించి కూడా ముఖ్యమంత్రి ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కేంద్ర సహాయాన్ని కోరారు. కార్మికులను కాపాడేందుక...
Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం
State

Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం

TG Govt to build Ratan Tata Road : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త దివంగ‌త ర‌త‌న్ టాటా స్మార‌కార్థం తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) ఓ కొత్త ర‌హ‌దారిని నిర్మించ‌నుంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైద‌రాబాద్ రింగ్ రోడ్డు (ORR)లోని రావిర్యాల్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) లోని అమనగల్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా అనుసంధానం చేయ‌నుంది. ఈ కొత్త ర‌హ‌దారికి ర‌త‌న్‌టాటా రోడ్ అని నామ‌క‌ర‌ణం చేయ‌నుంది. Ratan Tata Road : రూ. 4,030 కోట్ల వ్య‌యం ర‌త‌న్ టాటా స్మార‌క గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డును సుమారు రూ. 4,030 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్నారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ ర‌హ‌దారి నిర్మాణాన్ని చేప‌ట్ట‌నుంగా రెండు దశ‌ల్లో ప‌నులు సాగ‌నున్నాయి. మొదటి దశలో ORR లోని రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది, దీని కోసం రూ....
Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భ‌క్తుల‌తో పోటెత్తున్న శివాల‌యాలు
State

Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భ‌క్తుల‌తో పోటెత్తున్న శివాల‌యాలు

హైదరాబాద్‌: మహా శివరాత్రి (Maha Shivaratri) ప‌ర్వ‌దినం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బుధవారం ఉద‌యం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు త‌ర‌లిరావ‌డం మొద‌లైంది. శివుడికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో మారేడు ద‌ళాలు స‌మ‌ర్పించి అభిషేకాలు చేస్తున్నారు. ఆల‌యాల‌ ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మ‌హదేవుడి దర్శనం కోసం ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా భారీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో శైవ‌క్షేత్రాలు మారుమోగుతున్నాయి. Vemulawada Rajanna Temple : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ‌ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులు సైతం పెద్ద సంఖ్య‌లో తరలి వస్తున్నారు.‌ మహాశివరాత్రి సంద‌ర్భంగా రాజరాజేశ...
News Ration Cards | రేష‌న్ కార్డుల జారీకి రంగం సిద్ధం
State

News Ration Cards | రేష‌న్ కార్డుల జారీకి రంగం సిద్ధం

News Ration Cards | నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెల్లరేషన్ కార్డులు మరికొన్ని రోజుల్లో అందునున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్నా.. తెల్ల రేషన్‌ కార్డు లేకపోవడంతో అనేక మంది అర్హులై పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మార్చి 1వ తేదీన కొత్త రేషన్‌ ‌కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. News Ration Cards : జిల్లాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇలా హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాల్లో లక్ష కార్డులు హైదరాబాద్‌ - 285, ‌ వికారాబాద్‌ ‌జిల్లా- 22 వేలు, నాగర్‌కర్నూల్‌ ‌జ...
Elephant Attack | భక్తులపై ఏనుగుల దాడి .. ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
State

Elephant Attack | భక్తులపై ఏనుగుల దాడి .. ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

Three die in Elephant Attack : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లా ( Annammaiah district) ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం గుండ‌కోణ గ్రామంలో ఈ రోజు ఉద‌యం ఓ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శివాల‌యానికి వెళ్తున్న భ‌క్తుల (group of devotees)పై అడ‌వి ఏనుగులు దాడి చేశాయి. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అడ‌వి మార్గంలో ప్ర‌యాణిస్తుండ‌గా.. గ్రామస్థుల కథనం ప్రకారం… బాధితులు వై.కోట గ్రామానికి చెందినవారు. ప్రతి ఏటా మహాశివరాత్రి (Maha shivaratri) సంద‌ర్భంగా శివాలయం (shiva temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు గుండలకొణకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ప‌లువురు భక్తులు గుండలకొణ శివాలయానికి బయల్దేరారు. అడవి మార్గంలో వారు ప్రయాణిస్తుండగా అటుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు దాడికి దిగింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ...
error: Content is protected !!