KTR | ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంకు కేటీఆర్.. విచారణ వాయిదా
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR ) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ (Congress Party)లో చేరిన నేపథ్యంలో వీరిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వేసిన పిటిషన్పై ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టులో విచారణ ఇలా..
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి కేటీఆర్ వేసిన పిటిషన్ను విచారించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం నిర్ణయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి క...




