Accident | వరంగల్లో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
వరంగల్ (Warangal)లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల (iron bars) లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి (instant death) చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్-మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ఓవర్ లోడ్.. ఓవర్టేక్
రైల్వే ట్రాక్స్ (railway track)కు ఉపయోగించే ఇనుప రాడ్లను తరలిస్తున్న లారీ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే రెండు ఆటో రిక్షాలను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. వేగంగా ముందుకు దూసుకెళ్లే క్రమంలో అందులోని ఇనుప రాడ్లు కదలి ఆ ఆటోలపై పడ్డాయి. దీంతో ఏడుగురు దుర్మణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. వీరి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Warangal Accident : క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిన...




