Sarkar Live

State

Red alert | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద రెడ్‌ అల‌ర్ట్..
State

Red alert | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద రెడ్‌ అల‌ర్ట్..

Red alert | హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జ‌న‌వ‌రి 26న గణతంత్ర దినోత్సవం (Republic day 2025) ఉన్న నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎయిర్‌పోర్టు భద్రతను పటిష్టం చేయడంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Red alert : రెడ్ అలర్ట్ ప్రకటన జారీ జనవరి 30 వరకు ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్ (Red alert )ను అమల్లో ఉంచారు. అప్ప‌టి వ‌ర‌కు సందర్శకులు ఎయిర్‌పోర్టుకు రావద్దని సీఐఎస్ఎఫ్ అధికారులు ప్ర‌క‌ట‌న‌ జారీ చేశారు. గణతంత్ర వేడుకల కారణంగా ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా వ్యవస్థను కఠినతరం చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టామని తెలిపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు ఎయిర్‌పోర్టులో ప్రధాన రహదారుల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను నిర్వ‌హిస్తున్నారు. ఎయి...
UPSC Civil Services 2025 | యూపీఎస్సీ ఎగ్జామినేష‌న్స్‌ నోటిఫికేషన్‌ విడుదల
State

UPSC Civil Services 2025 | యూపీఎస్సీ ఎగ్జామినేష‌న్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

UPSC Civil Services 2025 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)-2025 నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (CSE), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (IFS) ఎగ్జామినేషన్‌కు ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. 979 సివిల్ సర్వీసెస్, 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) పోస్టులను భర్తీ చేయనున్నారు. 2024 సంవత్సరం నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య కాస్త త‌గ్గించారు. అయినా నిరుద్యోగులకు ఈ నోటిఫికేష‌న్ ఎంతో ప్ర‌ధాన‌మైన‌ది. యూపీఎస్సీ ప‌రీక్ష‌ల ద్వారా త‌మ బంగారు భ‌విష్య‌త్తుకు బాట వేసుకొనేందుకు ఇదెంతో చ‌క్క‌ని అవ‌కాశం. దేశానికి సేవ చేయడానికి ఒక గొప్ప ప్లాట్‌ఫాం. కఠినమైన శ్రమతో కూడుకొని ఉన్నా సమర్థమైన ప్రణాళిక, పట్టుదలతో ఈ లక్ష్యాన్ని సాధించుకోవ‌చ్చు. ప‌రీక్ష రాయ‌డానికి అర్హతలు: సివిల్ స‌ర్వీసెస్ : UPSC Civil Services 2025 ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉ...
Youth Congress : ర‌ణ‌రంగంగా మారిన గాంధీభవన్‌.. ఒకరినొకరు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..
State

Youth Congress : ర‌ణ‌రంగంగా మారిన గాంధీభవన్‌.. ఒకరినొకరు కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు..

Gandhi Bhavan : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress Leaders) ఒకరినొకరు పరుషపదజాలంతో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటనలో ప‌లువురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన‌వ వీడియోలు సోష‌ల్‌మీడియాలో ఇపుడు వైర‌ల్‌గా మారాయి. కొంద‌రు నాయ‌కులు కలిసి ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బుధ‌వారం గాంధీ భవ‌న్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వ‌హించారు. అయితే ఈ సమావేశం ప్రారంభమైన కాసేపటికి గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. యూత్ కాంగ్రెస్ నాయ‌కులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత ఇరు పక్షాలు ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌లు, దాడుల‌కు దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరువర్గాల నేతలు కొట్టుకున్న‌ట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వొచ్చిన వారికి పదవులు ఎలా కేటాయిస్తారంటూ కొత్తగూడెం జిల్లాల‌కు చెందిన యూత్‌ కాంగ్రెస్ నాయ‌కులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ‌కాలం నుం...
HCLTech : హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ విస్త‌ర‌ణ‌.. కొత్త‌గా 5,000 ఉద్యోగాలు
State

HCLTech : హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ విస్త‌ర‌ణ‌.. కొత్త‌గా 5,000 ఉద్యోగాలు

అంత‌ర్జాతీయ స్థాయి టెక్నాలజీ సంస్థ HCLTech హైదరాబాద్‌లో తన ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో 5,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ టెక్ దిగ్గజ సంస్థ సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో HCLTech సంస్థ ఈ కీల‌క ప్రకటనను చేసింది. HCLTech కీల‌క ప్ర‌క‌ట‌న‌ దావోస్‌లో భాగంగా HCLTech సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయకుమార్ (C Vijayakumar)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి డి. శ్రీధర్ బాబు స‌మావేశ‌మ‌య్యారు. వీరి భేటీలో ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో HCLTech సంస్థ ఈ కీల‌క ప్రకటనను చేసింది. హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయ‌నున...
Davos : డావోస్‌లో చంద్ర‌బాబు.. వ్యాపార దిగ్గ‌జాల‌తో భేటీ
State

Davos : డావోస్‌లో చంద్ర‌బాబు.. వ్యాపార దిగ్గ‌జాల‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని డావోస్ (Davos)లో ప‌ర్య‌టిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Microsoft founder Bill Gates)తో పాటు అనేక మంది అంత‌ర్జాతీయ కార్పొరేట్ అధిపతులతో ఈ రోజు చంద్ర‌బాబు నాయుడు ( N Chandrababu Naidu) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల‌ను ఆకర్షిస్తూ త‌ద్వారా అనేక ప్రాజెక్టుల‌ను స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశ‌గా వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు, ఒప్పందాలు జ‌రిగాయి. చంద్ర‌బాబు Davos ప‌ర్య‌ట‌న.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీల‌కం స్విస్ రిసార్ట్ టౌన్‌లో చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ భేటీ కీల‌కం కానుంది. యునిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సి, ఆస్ట్రాజెనెకా వంటి కంపెనీల అధిపతులతో సమావేశమై రాష్ట్ర...
error: Content is protected !!