Red alert | హైదరాబాద్ ఎయిర్పోర్టు వద్ద రెడ్ అలర్ట్..
Red alert | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic day 2025) ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎయిర్పోర్టు భద్రతను పటిష్టం చేయడంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Red alert : రెడ్ అలర్ట్ ప్రకటన జారీ
జనవరి 30 వరకు ఎయిర్పోర్టులో రెడ్ అలర్ట్ (Red alert )ను అమల్లో ఉంచారు. అప్పటి వరకు సందర్శకులు ఎయిర్పోర్టుకు రావద్దని సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రకటన జారీ చేశారు. గణతంత్ర వేడుకల కారణంగా ఎయిర్పోర్టు వద్ద భద్రతా వ్యవస్థను కఠినతరం చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టామని తెలిపారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు
ఎయిర్పోర్టులో ప్రధాన రహదారుల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను నిర్వహిస్తున్నారు. ఎయి...




