Sarkar Live

State

Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌
State

Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌

Tirupati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆల‌య‌ పాకశాలను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (ఎస్ఐటీ) శ‌నివారం ఉద‌యం ప‌రిశీలించింద‌ని తెలుస్తోంది. తిరుమ‌ల ల‌డ్డూ (ప్ర‌సాదం) త‌యారీ విష‌యంలో వ‌చ్చిన వివాదంపై విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ బృందంలోని ఆరుగురు స‌భ్యులు సంద‌ర్శించారు. ఆల‌యంలోని ప‌లు విభాగాల‌ను ప‌రిశీలించారు. నాణ్య‌తపై న‌జ‌ర్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)లోని ఆరుగురు సభ్యులు తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. లడ్డూ త‌యారీపై దర్యాప్తు చేస్తున్న ఈ బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించింద‌ని, ల‌డ్డూ తయారయ్యే పాకశాలను సంద‌ర్శించిందని ప‌లు మాధ్య‌మాలు వెల్ల‌డించాయి. లడ్డూ నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల కూడా ఈ టీమ్ స‌భ్యులు ప‌రిశీలించార‌ని తెలుస్తోంది. లడ్డూకు ఉపయోగించే పిండిని తయారు చేసే మిల్లును కూడా ప‌రిశీలించినట్టు స‌మాచారం. ప్ర‌సాదం నాణ్య...
MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు
State

MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. Hyderabad : సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే త‌న్నీరు హ‌రీష్ రావు ( BRS MLA Harish Rao ) అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని శ‌నివారం మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు మధుసూదన్ చారి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్ తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నద‌ని హ‌రీష్ రావు అన్నారు. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.  వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంట‌నే వీరికి మంచి దవాఖానకు పంపించకుండా హా...
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు
State

TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు

TGSRTC |  హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ రోగాల చికిత్స కోసం ఇకపై హైదరాబాద్‌లోని తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వీరికోసం ప్ర‌త్యేకంగా డిస్పెన్సరీలను (TGSRTC dispensaries) ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ డిస్పెన్సరీల్లో అత్యవసర వైద్య‌చికిత్స‌లు ఉండ‌వు. అర్టీసీ కార్మికులంద‌రికీ సాధార‌ణ చికిత్సలను ఇందులో అందించనున్నారు. కార్పొరేషన్‌కు చాలా కాలంగా ఈ డిస్పెన్స‌రీల‌ను ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ కార్పొరేషన్ వద్ద తగినంత నిధులు లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఇటీవల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ డిస్‌పెన్సరీల ఏ...
రూ. 300లోపు ఉత్తమ జియో ప్లాన్‌లు ఇవే. : త‌క్కువ ధరలకు 1.5GB రోజువారీ డేటా
State

రూ. 300లోపు ఉత్తమ జియో ప్లాన్‌లు ఇవే. : త‌క్కువ ధరలకు 1.5GB రోజువారీ డేటా

Jio plans under Rs 300 : ఈ ఏడాది జూలైలో Jioతో సహా అన్ని ప్రైవేట్‌ టెలికాం ప్రొవైడర్లు తమ టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌ల‌నుపెంచారు, దీంతో టెల్కోలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కస్టమర్ భారీగా బిఎస్ఎన్ఎల్ కు మారారు. అయినప్పటికీ, దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, అన్ లిమిటెడ్ కాలింగ్ వంటి ఫీచర్లతో అనేక తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. తాజాగా జియో త‌క్కువ ధ‌ర‌తో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. Jio రూ. 299 ప్లాన్ ఈ 28-రోజుల ప్యాకేజీతో వినియోగదారులు భారతదేశంలో ఎక్కడైనా తమకు అన్ లిమిటెడ్‌ కాల్‌లు చేయవచ్చు. అదనంగా, రోమింగ్ కు అదనపు రుసుములు లేవు. వినియోగదారులు ప్రతిరోజూ పొందే 1.5GB డేటాతో స్ట్రీమ్ చేయవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు. ఇది నెలకు 42GB వరకు అందుతుంది. మీరు ప్రతిరోజూ జియో యాప్ సేవలు, 100 ఉచిత టెక్స్ట్ మెసేజ్‌లకు యాక్సెస్‌ను కూడా అందుకుంటారు. Jio రూ. 239 ప్లాన...
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్ డేట్
State

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్ డేట్

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌. స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని  జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న , గ్రూప్ -2 ప‌రీక్ష‌లు, మెస్ ఛార్జీలు, కులగణన సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్రతీ ఐదు వందల మందికి ఒక సర్వేయ‌ర్‌ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో ‘వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31 లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వ...
error: Content is protected !!