Sarkar Live

State

Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ
State, Hyderabad

Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Heavy rains : భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ (Hyderabad) కేంద్రం తాజాగా జారీ చేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే సెప్టెంబరు చివరి వారంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనలు వెలువడగా, ఇప్పుడు మరింత స్పష్టమైన హెచ్చరికను విడుదల చేశారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ India Meteorological Department (IMD) ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు ఇది కొనసాగనుంది. తెలంగాణ‌లోని ఉత్త‌ర‌, మ‌ధ్య‌, ప‌శ్చిమ‌, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని IMD వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు...
Rains | నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
State

Rains | నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

Telagnana Rains | బంగాళాకాతంలో ఏర్ప‌డిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మానుకోట‌, పాల‌మూరు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి పాల‌మూరు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాత...
రియో కార్నివ‌ల్ త‌ర‌హాలో బ‌తుక‌మ్మ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో వేడుక‌లు – Bathukamma festival
State, Hyderabad

రియో కార్నివ‌ల్ త‌ర‌హాలో బ‌తుక‌మ్మ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో వేడుక‌లు – Bathukamma festival

Bathukamma festival : బతుకమ్మ పండుగ ను అంత‌ర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ (Telangana tourism) ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 21 నుంచి 30 వరకు జరిగే ఈ తొమ్మిది రోజుల పూల పండుగను ఈసారి మరింత వైభవంగా జరపాలని సంకల్పించింది. ఈ సారి కూడా బతుకమ్మ ఉత్సవం వ‌రంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి (Thousand Pillar Temple) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు పురాతన కట్టడాల మధ్య సమూహంగా ఆడుతూ పాడుతూ జరుపుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కొంగొత్త త‌ర‌హాలో Bathukamma festival బ‌తుక‌మ్మ ఉత్స‌వాల ((Bathukamma festival)ను ఈ సారి రియో కార్నివల్ తరహాలో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism minister Jupally Krishna Rao) తెలిపారు. ప్రపంచ పర్యాటక...
Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం
State, warangal

Medaram | మరింత విశాలంగా మేడారం గుడి ప్రాంగణం

Medaram Temple | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం (Medaram Temple) అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించింది. మేడారం ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శంకుస్థచేస్తారని మంత్రులు ప్రకటించారు. ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్య...
TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు
State, Hyderabad

TGSRTC : బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు

ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు ప్ర‌జ‌ల‌ను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు TGSRTC Special Buses 2025 : బ‌తుక‌మ్మ‌, దసరా పండుగల నేప‌థ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 7,754 ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను (Bathukamma Dasara Special Services) బస్సులను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో 377 స్పెష‌ల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని క‌ల్పించింది. ఈనెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు ప్ర‌త్యేక బ‌స్సులను న‌డ‌ప‌నుంది. సద్దుల బ‌తుకమ్మ ఈనెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీ...
error: Content is protected !!