భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident
సహకరించిన కుటుంబ సభ్యులు కూడా
Prakasam Incident | భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన అక్క, మేనల్లుడితోపాటు ఈ దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలును సైతం అదుపులోకి తీసుకున్నారు. వివాహితను రెండు చేతులను రెండు కర్రలకు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Prakasam Incident : ఏం జరిగింది?
భాగ్యలక్ష్మి అనే మహిళను బాలాజీ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ కొంతకాలంగా భార్య పిల్లలను వద...




