Sarkar Live

State

Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు
State, Hyderabad

Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు

Security Jobs in Hyderabad Metro | “ట్రాన్స్‌జెండర్లు (Transgenders) ఎందులోనూ తక్కువ వారు కాదు, తలెత్తుకుని బ‌తికే వారని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్ల‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.మంగళవారం మంత్రి ఛాంబర్లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు (Security Jobs) నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తె...
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు
State, Hyderabad

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు

Hyderabad : తెలంగాణలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses) కింద లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తాజా విడతలో 13,841 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు జమ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.1435 కోట్ల నిధులను విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పురోగతి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1.29 లక్షల ఇళ్లు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో , 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లలో పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేసినట్టు తెలిపారు. ప్రతి సోమవారం నగదు జమ విధానం ప్రతి సోమవారం, ఇళ్ల నిర్మాణ (Indiramma Houses ) పురోగతిని బట్టి లబ్ధిదారుల బ్యాంక్ ...
TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్
State, AndhraPradesh

TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్

త్వ‌ర‌లో బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో ముందస్తు భద్రతా చర్యలు తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavam 2025) దృష్టిలో ఉంచుకుని, టిటిడి (TTD) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య విభాగం సిబ్బంది, తిరుమల పోలీసులతో కలిసి తిరుమలలో అనధికార వ్యక్తులు, యాచకులను ఇక్క‌డి నుంచి పంపించేందుకు (Beggars Eviction) ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కల్యాణకట్ట, SV షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని షెడ్లలో చాలా కాలంగా ఉంటున్న యాచకులు, అక్రమ వ్యాపారులను తిరుమల నుంచి బహిష్కరించారు. పోలీసులు, TTD విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ అధికారులు ఎటువంటి పర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తున్న 82 మంది అనధికార వ్యాపారులను, ఇక్కడ చాలా...
Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?
State, Nalgonda

Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao ) విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈసంద‌ర్భంగా హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాస...
సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline
State, Karimnagar

సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline

Sircilla Vemulawada Railway Lline : ఎన్నో ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఎట్టకేలకు సిరిసిల్ల జిల్లా (Rajanna sircilla district )కు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం రైల్వే అధికారులు సిద్దిపేట (Siddipet) శివార్లలోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పెద్దకోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్ గ్రామాల మీదుగా మందపల్లి వరకు విజయవంతమైన ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్-కొత్తపల్లి (Manoharabad Kothapalli Line ) రైల్వే ప్రాజెక్ట్ 162 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఈ రైల్వేలైన్‌కు ₹1,162 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచ‌నా వేసింది. ఇందు కోసం ₹350 కోట్లు కేటాయించింది. వీటిలో గత బడ్జెట్ నుంచి ₹165 కోట్లు ఉన్నాయి. మనోహరాబాద్-సిద్దిపేట విభాగం ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు సిద్దిపేట-సిరిసిల్ల‌ మార్గంలో ట్రయల్ రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ లైన్ త్వరలో తంగెళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చేరుకుంటుందని రైల...
error: Content is protected !!