Sarkar Live

State

Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు
State, Hyderabad

Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు

Aarogyasri | “ఆరోగ్యశ్రీ, EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ) JHS (జ‌ర్న‌లిస్ట్ హెల్త్ స్కీమ్‌) ల లబ్ధిదారులకు ఉచిత వైద్య‌ సేవలను అందించడంలో అనేక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోస్తున్నామ‌ని ఆరోగ్య‌శ్రీ (Aarogyasri) నెట్ వ‌ర్క్ ఆసుపత్రులు చాలా వరకు మూసివేయబడే ప్రమాదం పొంచి ఉందని TANHA తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో, TANHA సభ్యులు ఇలాగే నిరసన తెలుప‌గా రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా.. అనేక సమావేశాలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. TANHA యొక్క కొన్ని ప్రధాన డిమాండ్‌లు చేస్తోంది. సభ్య ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాలను (నిబంధనలు షరతులు) తిరిగి రూపొందించడం, ప్యాకేజీల సవరణ, సాధారణ చెల్లింపులు, పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఎటువంటి ఆందోళన లేదా పరిశీలన లేకుండా ఏకపక్షంగా సర్క్యులర్‌లను జా...
Mnister Seethakka |  మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు
State

Mnister Seethakka | మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు

Hyderabad News | త‌న‌కు మంత్రి కొండా సురేఖ‌ (Minister Konda Surekha) కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని మంత్రి సీతక్క (Mnister Seethakka ) స్ప‌ష్టం చేశారు. రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని, సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది గతసారి అనారోగ్యం.. సొంత పనుల వల్ల కొండా సురేఖ రాలేకపోయారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. మా మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు. మేము సమ్మక్క సారలమ్మ మాదిరిగా అక్కాచెల్లెళ్ల లాగా కలిసే ఉన్నామ‌ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara 2026) పై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింద‌ని, వచ్చే సంవత్స‌రం సమ్మక్క సారక్క జాతర జనవరి...
Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..
Hyderabad, State

Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈమేర‌కు గురువారం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఇక శుక్రవారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉండే సూచనలున్నాయని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయం...
Registration Buildings |  సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు
State, Hyderabad

Registration Buildings | సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు

ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు Integrated Registration Buildings : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధ‌వారం గ‌చ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన సంద‌ర్బంగా ఏర్పాటైన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్ర‌సంగించారు. దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క‌టిగా అభివృద్ది కార్యక్ర‌మాలు అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాల శంకుస్దాప‌న అని వివ‌రించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలోగ‌ల ...
Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం
State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ములుగును ముంచెత్తుతున్న ముసురు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్‌ (ఆదిలాబాద్‌)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్‌)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్‌)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్...
error: Content is protected !!