చర్లపల్లి రైల్వే టర్మినల్ (Charlapalli railway terminal)ను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ టర్నిన్ను నిర్మించారు. విమానాశ్రయాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంతరం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేషన్లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి.
Charlapalli railway Station లో అత్యాధునిక సౌకర్యాలు ఇవే…
చర్లపల్లి రైల్వే స్టేషన్ను టర్మినల్గా అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. రోజుకు 50 రైళ్లు ఈ దీని ద్వారా నడుస్తాయి. తొమ్మిది ప్లాట్ఫారాల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, విస్తారమైన పార్కింగ్ స్థలాలతో ఈ టెర్మినల్ ఆకర్షణీయంగా తయారైంది. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ రూములు ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ లాంజ్ కూడా అందుబాటులో ఉంది. మొదటి అంతస్తులో క్యాఫెటీరియా, రెస్టారెంట్, పసిబిడ్డల తల్లుల కోసం ఫీడింగ్ రూములు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మహిళలు, పురుషుల కోసం విశ్రాంతి గదులను కూడా నిర్మించారు.
ఇక సౌకర్యవంత.. వేగవంత ప్రయాణం
చర్లపల్లి టర్మినల్లో 19 ట్రాక్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ముఖ్యమైన రైళ్లు చార్లపల్లి నుంచి నడవడం ద్వారా సికింద్రాబాద్ స్టేషన్లో రద్దీ తగ్గనుంది. గోరఖ్పూర్-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్, షాలీమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు చార్లపల్లి నుంచి నడుస్తాయి.
భవిష్యత్ అవసరాల కోసం..
రానున్న 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా ఈ టర్మినల్ను అభివృద్ధి చేశారు. దీని ప్రారంభంతో నగరంలోని ప్రయాణికుల రద్దీ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
ప్రారంభోత్సవంలో ముఖ్యులు
చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vishnav) హాజరయ్యారు. నేరుగా తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గానే పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు నేరుగా పాల్లొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Charlapalli : చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రారంభించిన మోదీ”