– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం
Mulugu : సీనియర్ జర్నలిస్ట్, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన ‘ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ’ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం.
గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
మూడున్నర దశాబ్దాల జర్నలిజం సేవలకు గౌరవం
గడ్డం కేశవమూర్తి గత 35 ఏళ్లుగా జర్నలిస్టుగా వివిధ దినపత్రికలలో పని చేస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఆరు పుస్తకాలు రచించి ప్రచురించిన ఆయన, 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సక్సెస్ స్టోరీస్ను ‘జనసారథులు’ పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు.
అలాగే ఆయన జర్నలిస్టు సంఘాల్లోనూ ముఖ్యపాత్ర వహించారు. గతంలో వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మూడేళ్లు సేవలందించారు. రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు.
హర్షం వ్యక్తం చేసిన సాహితీవేత్తలు, పాత్రికేయులు
గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు వరించడంపై పలు సాహిత్య వర్గాలు, కళాకారులు, పాత్రికేయ సంఘాలు అభినందించాయి. జర్నలిజానికి ఈ అవార్డు మరింత గౌరవాన్ని తీసుకుచ్చిందని పలువురు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ (Warangal Press Club), జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు కేశవమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.