India-Pakistan War LIVE Updates : ఆపరేషన్ సిందూర్ తో తీవ్ర పరాభవానికి గురైన పాకిస్తాన్.. పరువు నిలుపుకునేందుకు జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్తో సహా అనేక భారత సైనిక, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది, క్షిపణులతోపాటు పేలోడ్లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే మరోసారి భారత ఆర్మీ తనదైన శైలిలో పాక్ కు గట్టిగుణపాటం చెప్పింది. మన వైమానిక రక్షణ వ్యవస్థలు రాబోయే ముప్పులను ముందే పసిగట్టి మిసైళ్లను విజయవంతంగా తిప్పికొట్టాయి.
భారత్ – పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, మే 7–8 రాత్రి పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టడంతో పాటు ‘కాల్పు విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చాం ‘ అని భారత సైన్యం శుక్రవారం ధృవీకరించింది. #ఆపరేషన్ సిందూర్ లో భారత సాయుధ దళాలు వేగంగా ప్రతిస్పందించాయి.
పాకిస్తాన్ కు చెందిన హచ్ క్యూ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (HQ IDS) ప్రకారం, పాకిస్తాన్ జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్తో సహా అనేక భారతీయ సైనిక స్థావరాలు, సాధారణ పౌర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. క్షిపణుల దాడి, పేలోడ్లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్లను ఉపయోగించింది. అయితే, భారతదేశం బలమైన వైమానిక రక్షణ వ్యవస్థలు L-70 గన్స్, Zu-23mm, షిల్కా వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలతో సహా – రాబోయే ముప్పులను విజయవంతంగా అడ్డుకున్నాయి.
India-Pakistan War : జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లలో దాడులు విస్తరించాయి, నౌషేరాతో సహా అనేక సెక్టార్లలో పాకిస్తాన్ డ్రోన్లను కాల్చివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జమ్మూ, బికనీర్, జలంధర్, కిష్త్వార్, అఖ్నూర్, సాంబా, అమృత్సర్లలో పూర్తి బ్లాక్అవుట్లు అమలు చేశారు. మే 9 ఉదయం అమృత్సర్తో సహా వివిధ ప్రాంతాల నుండి సైరన్లు, పేలుళ్లు సంభవించాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.