Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ
Operation Keller | కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్ దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం, మే 13, 2025న భారత సైన్యం (Indian Armed Forces) ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన పక్కా సమాచారం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు అందింది. దీంతో వెంటనే 'ఆపరేషన్ కెల్లర్'గా కోడ్ నేమ్ తో సైనిక చర్యను ప్రారంభించిది.
సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో పోస్ట్ చేయబడిన అధికారిక ఆర్మీ ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) . మే 13, 2025న, #షోపియన్లోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) యూనిట్ ఇచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, #ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. దీని ఫలితంగా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసా...




