Sarkar Live

Privacy Policy

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ
State, Crime

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ

ACB Raids | ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదును చూసి ప‌క్కా వ్యూహంతో అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంటోంది. తాజాగా ఓ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation Department)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స‌ద‌రు అవినీతి అధికారి ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గా విధులు నిర్వహిస్తున్న ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మధ్య‌లో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివ‌ర‌కు బేరం రూ.75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద...
India attacks pakistan | పాకిస్తాన్‌లోని ఈ 5 సైనిక స్థావరాలపై దాడి భారత ఆర్మీ ప్ర‌క‌ట‌న‌
National

India attacks pakistan | పాకిస్తాన్‌లోని ఈ 5 సైనిక స్థావరాలపై దాడి భారత ఆర్మీ ప్ర‌క‌ట‌న‌

India attacks Pakistan : భారత్ ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆగ్రహంతో ఉంది. జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, రాజస్థాన్ సరిహద్దులోని నగరాలను లక్ష్యంగా దాడిచేయ‌డానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. గత 24 గంటల్లో పాకిస్తాన్ 26 చోట్ల దాడి చేసింది. దీనికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఎల్‌ఓసీలోని అనేక చోట్ల అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయి. ఇంతలో, పాకిస్తాన్ మీడియా వారి మూడు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎంతగా ఆగ్రహించిందంటే, అది డ్రోన్లు మరియు క్షిపణులతో భారత్ లోని నివాస ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్‌లోని 5 సైనిక స్థావరాలపై దాడి చేసిందని సమాచారం వెలుగులోకి వచ్చింది.పాకిస్తాన్‌లోని ఈ 5 సైనిక స్థావరాలు సుకుర్, నూర్ ఖాన్, రఫీకి, మురిద్, రహీం యార్ ఖాన్‌ భార‌త ఆర్మీ దాడుల‌కు ప్ర‌భావిత‌...
పాక్ దాడుల్లో ప్రభుత్వ అధికారితో సహా ఐదుగురి మృతి – Operation Sindoor Live
National

పాక్ దాడుల్లో ప్రభుత్వ అధికారితో సహా ఐదుగురి మృతి – Operation Sindoor Live

Operation Sindoor Live | రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లో శనివారం ఉదయం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి సహా ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌ (North Kashimir)లోని ఉరి నుంచి జమ్మూ ప్రాంతంలోని రాజౌరి(Rajouri), పూంచ్ (Punch) వరకు నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ దళాలు రాత్రిపూట మోర్టార్, ఆర్టిలరీ షెల్స్‌ను ప్రయోగించాయి. పాకిస్తాన్ (Pakistan) దళాల కాల్పుల్లో అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజౌరిగా ఉన్న ఉన్నతాధికారి రాజ్ కుమార్ తప్పా మరణించారు. ఒక షెల్ అతని ఇంటికి తగలడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందతూ అతడు మరణించాడు. ఈ విషయమై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా Xలో పోస్ట్ చేశారు. "రాజౌరి నుంచి చేదు వార్త మేము J&K అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు చెందిన...
రంగంలోకి ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్..2 పాక్ ఫైటర్ జెట్‌ల నేలమట్టం India vs Pakistan War Live Updates
National

రంగంలోకి ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్..2 పాక్ ఫైటర్ జెట్‌ల నేలమట్టం India vs Pakistan War Live Updates

India vs Pakistan War Live Updates : భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని మన భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. సిందూర్ ఆపరేషన్‌లో భాగంగా భారత సాయుధ దళాలు వేగంగా చర్య తీసుకున్నాయి, ఎటువంటి నష్టాలు లేకుండాపాక్ క్షిపణులను ఆకాశంలోనే పేల్చివేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (HQ IDS) ప్రకారం, పాకిస్తాన్ జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌తో సహా అనేక భారతీయ సైనిక స్థావరాలు, పౌర ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది, క్షిపణుల దాడి, పేలోడ్‌లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్‌లను ఉపయోగించింది. అయితే, భారతకు చెందిన బలమైన వైమానిక రక్షణ వ్యవస్థలు - L-70 తుపాకులు, Zu-23mm, షిల్కా వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలతో సహా - పాక్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. కాగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లలో నౌషేరాతో సహా అనేక సెక్టార్లలో...
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదుగా..!
Cinema

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదుగా..!

Tollywood News | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ ,లైగర్ (Family star, Ligar)లాంటి డిజాస్టర్ లు ఎదురైన కూడా తన మార్కెట్ మాత్రం ఏమాత్రం డౌన్ ఫాలో కాలేదంటే తనకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. టాలీవుడ్ లో రౌడీ హీరో సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. డిఫరెంట్ మేనరిజంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు.తను తీసిన మూవీస్ లలో హిట్టు కొట్టినవి తక్కువే అయినా ఆడియన్స్ ను మెప్పించేలా తీశాడు. ప్రజెంట్ తన సినిమాల లైనప్ చూస్తే మతిపోయేలా ఉన్నాయి. బడా బ్యానర్ల లో సినిమాలు చేస్తూ క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాలపై మేకర్స్ అప్డేట్స్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధన (roudy Janardhan) మూవీ ఒకటి కాగా మరొకటి శ్యామ్ సింగరాయ్...
error: Content is protected !!