Sarkar Live

Privacy Policy

300-400 డ్రోన్లతో 36 చోట్ల పాక్ దాడి.. దీటుగా ప్రతీకారం తీర్చుకున్నాం.. India-Pakistan Conflict Live
National

300-400 డ్రోన్లతో 36 చోట్ల పాక్ దాడి.. దీటుగా ప్రతీకారం తీర్చుకున్నాం.. India-Pakistan Conflict Live

India-Pakistan Conflict Live : పాకిస్తాన్ నిరంతరం భారతదేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ నిరంతరం సరిహద్దు దాటి క్షిపణులను, డ్రోన్లను పంపింది. అయితే, భారత్ (Indian Army) పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడంలో నిమగ్నమై ఉంది. ఈ మొత్తం పరిణామాల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వివరణాత్మక సమాచారాన్ని మీడియా సమావేశంలో వెల్లడించింది. నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలు పిరికితనంతో కూడుకున్నవని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ పాకిస్తాన్ నిన్న రాత్రి పౌరుల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి యత్నించిందని అన్నారు. పాకిస్తాన్ చర్యలకు భారత సైనిక విభాగాలు బలంగా స్పందించాయి. India-Pakistan Conflict పాకిస్తాన్ దాడులకు భారతదేశం ప్రతీకారం తీర్చుకుందని ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి (Sofia Quereshi) తెలిపారు. మే...
ఎల్ఓసి అంతటా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు – India-Pakistan War LIVE Updates
State

ఎల్ఓసి అంతటా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన దాడులు – India-Pakistan War LIVE Updates

India-Pakistan War LIVE Updates : ఆపరేషన్ సిందూర్ తో తీవ్ర పరాభవానికి గురైన పాకిస్తాన్.. పరువు నిలుపుకునేందుకు జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌తో సహా అనేక భారత సైనిక, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది, క్షిపణులతోపాటు పేలోడ్‌లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే మరోసారి భారత ఆర్మీ తనదైన శైలిలో పాక్ కు గట్టిగుణపాటం చెప్పింది. మన వైమానిక రక్షణ వ్యవస్థలు రాబోయే ముప్పులను ముందే పసిగట్టి మిసైళ్లను విజయవంతంగా తిప్పికొట్టాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, మే 7–8 రాత్రి పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టడంతో పాటు 'కాల్పు విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చాం ' అని భారత సైన్యం శుక్రవారం ధృవీకరించింది. #ఆపరేషన్ సిందూర్ లో భారత సాయుధ దళాలు వేగంగా ప్రతిస్పందించాయి. పాకిస్తాన్ కు చెందిన హచ్ క్యూ ఇంటిగ్రేటె...
విషాదం..  కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War
State

విషాదం.. కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War

India Pakistan War : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీనాయక్ (Jawan Murali Nayak) స్వస్థలం సత్యసాయి జిల్లా, జిల్లా గోరంట్ల మండలం జిల్లా కల్లి తండా. మురళీనాయక్ యుద్దంలో మరణించినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. శనివారం మురళీ నాయక్ పార్ధీవ దేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. వీర జవాన్ మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు. సీఎం చంద్రబాబు నివాళి దేశ రక్షణలో అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘనంగా నివాళులర్పించారు. పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు ని...
IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!
Sports

IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!

IPL 2025 Suspended News : తాజా నివేదికల ప్రకారం, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య IPL 2025 ను తక్షణమే వాయిదా వేయాలని IPL పాలక మండలి నిర్ణయించింది. ధర్మశాలలో బ్లాక్‌అవుట్ ప్రకటించిన తర్వాత గురువారం పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. అటువంటి పరిస్థితిలో, IPL పాలక మండలి ధర్మశాలలో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. ప్రత్యేక రైలులో ఢిల్లీకి క్రికెటర్ల తరలింపు పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి ఢిల్లీ(Delhi)కి ప్రత్యేక రైలులో పంపించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ధర్మశాల దగ్గర నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి స్టేడియాన్ని కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ...
Airports Closed | భారత్‌ పాక్ ఉద్రిక్తతలు.. 400 కి పైగా విమానాలు రద్దు.. 27 విమానాశ్రయాల మూసివేత..
National

Airports Closed | భారత్‌ పాక్ ఉద్రిక్తతలు.. 400 కి పైగా విమానాలు రద్దు.. 27 విమానాశ్రయాల మూసివేత..

Airports Closed | భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు (Border Tensions) పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను శుక్ర‌వారం నుంచి శనివారం (మే 10) ఉదయం మూసివేసింది (Airports Closed). దీని ఫలితంగా విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా, భారత విమానయాన సంస్థలు 430 విమానాలను రద్దు చేశాయి. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్ విమానాలలో దాదాపు 3 శాతం. ప్రయాణీకులు తమ విమాన స్థినతిని విమానయాన సంస్థలతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. మ‌రోవైపు రోజువారీ విమాన ట్రాఫిక్‌లో దాదాపు 17 శాతం ఉన్న 147 కి పైగా విమానాలను కూడా పాకిస్తాన్ క్యారియర్లు రద్దు (Flights Cancelled) చేశాయి. గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ Flightradar24 ప్రకారం, పాకిస్తాన్ - భారతదేశ పశ్చిమ కారిడార్, కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఉన్న వైమానిక స్థలం గురువారం పౌర విమానాలతో ఎగ‌ర‌క‌పోవ...
error: Content is protected !!