Sarkar Live

Privacy Policy

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి
National

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి

Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్‌కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట‌నే స్పందించి క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున...
ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record
Sports

ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record

Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంతంగా ఎదుర్కొన్న రోహిత్, కీలకమైన మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. అఫ్రిది తన కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఇప్పుడు 352 సిక్సర్లతో అతన్ని వెనక్కి నెట్టాడు. మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన రాంచీలో జరిగిన ఈ వన్డేలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన నుంచి కొనసాగిస్తున్న అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడ...
Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌
State, Hyderabad

Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌

పెండింగ్ బిల్లులకు రూ. 707.30 కోట్లు విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు (Telangana Employees) తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెల...
Akhanda 2 : సింగిల్ టికెట్‌కు రూ. 2 లక్షలు – ఎన్ఆర్ఐ అభిమాని సంచలన రికార్డ్! నందమూరి అభిమానం అంటే ఇదే
Cinema

Akhanda 2 : సింగిల్ టికెట్‌కు రూ. 2 లక్షలు – ఎన్ఆర్ఐ అభిమాని సంచలన రికార్డ్! నందమూరి అభిమానం అంటే ఇదే

Akhanda 2 Ticket Price | హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వ‌స్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ క్రమంలో, బాలకృష్ణ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పే అసాధారణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జర్మనీ అభిమాని రికార్డ్ సాధారణంగా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం ఆసక్తి చూపిస్తారు. అయితే, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ (NRI) అభిమాని రాజశేఖర పర్నపల్లి ఏకంగా ఒకే టికెట్‌ను రెండు లక్షల రూపాయలు (రూ. 2,00,000) చెల్లించి కొనుగోలు చేశారు. బాలయ్యపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ బృందం సోషల్ మీడియా వేద...
Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా
Hyderabad

Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా

Cyclone Dhitwa : బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫానుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. తుఫాను ఆదివారం నాటికి పుదుచ్చేరి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో చలి పంజా! దిత్వా తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ గణనీయంగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30వ తేదీ వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి 9 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉంది.రాష్ట్ర‌ రాజధాని హైదరాబాద్‌లో కూడా మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని నిపుణులు హెచ్చ...
error: Content is protected !!