Sarkar Live

Privacy Policy

Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి
Viral

Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

Narsampet Viral Video | హైదరాబాద్‌–మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్సులో ఇద్దరు చిత్తుగా మ‌ద్యం సేవించి వీరంగం సృష్టించారు. వరంగల్‌ వద్ద ఎక్కిన ఈ ఇద్దరు యువకులు నర్సంపేటకు టికెట్‌ తీసుకున్నప్పటికీ, అక్కడికి రాగానే దిగేందుకు నిరాకరించారు. కండక్టర్‌ వారిని దించేందుకు ప్రయత్నించగా రెచ్చిపోయారు. డ్రైవ‌ర్, కండక్ట‌ర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. బస్సును పక్కన ఆపి ఆర్టీసీ సిబ్బంది మందుబాబులను దించేందుకు ప్రయత్నించడంతో, “నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దన్న” అంటూ యువకులు మరింత ఆగ్రహంతో ప్రవర్తించారు. డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి చేయడానికి య‌త్నించారు.ఇదంతా గమనించిన ప్రయాణికులు జోక్యం చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన వీడియో బస్సులో ఉన్నవారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. Shocking: RTC బస్సులో మ...
హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions
State, Hyderabad

హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions | రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోర్ అర్బన్‌ ప్రాంత విస్తరణ, విద్యుత్‌ సరఫరా బలోపేతం, పరిశ్రమల ప్రోత్సాహం, పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాలపై కేబినెట్‌స‌మావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. 27 మున్సిపాలిటీలను GHMC లో విలీనం : ఔటర్ రింగ్ రోడ్ లోపల–బయట ఉన్న, ORR ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్‌ను GHMCలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన GHMC Act, Telangana Municipal Act సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. రాజ‌ధాని నగర విస్తరణ, పునరాభివృద్ధిని క్రమబద్ధీకరించనుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు : ప్రస్తుతం ఉన్న NPDCL, SPDCL‌లతో పాటు, వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేష...
Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌
State, Hyderabad

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304 కోట్ల వడ్డీలేని రుణాలను (Interest Free Loans) నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ములుగు జిల్లా నుంచి పంచాయతీరాజ్ మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. నవంబర్ 25 ఉదయం 11 గంటలకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తాలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, పారదర్శకత కోసం ప్రతి సభ్యురాలికి ...
Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
Cinema

Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra | బాలీవుడ్ లెజెండరీ నటుడు, భారతీయ సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన ధర్మేంద్ర సోమవారం ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగంతో చేసిన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఆయన మరణం ధృవీకరించారు. అయితే కుటుంబం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 8న ఆయన 90వ పుట్టినరోజు జరుపుకునే ముందు ఈ విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను నవంబర్ 10న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, గోవింద వంటి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రెండు రోజుల తర్వాత, కుటుంబ స‌భ్యులు ఇంటి నుంచే చికిత్స చేయాల‌ని కోరుకోవడంతో ధర్మేంద్రను నవంబర్ 12న డిశ్చార్జ్ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో చివరకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు ధర్మేంద్రకు ...
National

Delhi Blast Case : టెర్రర్ మాడ్యూల్‌ దర్యాప్తులో సంచ‌ల‌న‌ విష‌యాలు..

Delhi Blast Case | దిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి బయటపడిన ఫరీదాబాద్‌ వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు శ‌ర‌వేగంగా సాగుతోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని మౌల్వీ ఇష్తియాక్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇష్తియాక్ మాత్రం అరెస్ట‌యిన ఉగ్రవాదులు తనకు బకాయిగా ఉన్న అద్దె ఇవ్వాలని పదే పదే కోరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్రతగల కేసు ఉన్నప్పటికీ, ఆయనకు కేవలం కిరాయి అంశమే ముఖ్యమైందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కీలక నిందితుడు డాక్ట‌ర్‌ ముజమ్మిల్‌ను అరెస్టు చేసి విచారించినప్పుడు మొదటిసారిగా ఇష్తియాక్‌ పేరు బయటపడింది. ముజమ్మిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్‌లోని అద్దె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని, హర్యాణా మేవాత్‌కు చెంద...
error: Content is protected !!