Ethanol factory | ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు
Suryapet : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory)ని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్లో ఎన్ఎంకే బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికులు నిరసనలు ముమ్మరం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా యజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్లోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు.
Ethanol factory ని మూసివేయండి..
ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు నినాదాలు చేశారు. కాగా ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఇథనాల్ పరిశ్రమ ఎదుట భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసన...




