Green energy 2025 | భారత్ లో గ్రీన్ ఎనర్జీ.. 2025లో 214 గిగావాట్ల సామర్థ్యం
Green energy 2025 : భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం 200 GW పునరుత్పాదక శక్తి (renewable energy) సామర్థ్యాన్ని ఇది అధిగమించింది. 2025 ప్రారంభానికి 214 GW సామర్థ్యానికి చేరుకుంది. 2030 నాటికి 500 GW నాన్ నాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా. గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక శక్తినిపెంచేందుకు భారతదేశం ముందడుగు వేస్తోందని, దీంతో ఈ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్నామని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది,
Green energy 2024లో సాధించిన విజయాలు
గతేడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు భారతదేశం 15 GW పునరుత్పాదక శక్తిని జోడించింది. 2023 అదే కాలంలో 7.57 GW జోడించగా ఇది రెండింతలు పెరిగింది. 2024లో సౌర శక్తి (solar energy) సామర్థ్యం 94.17 GWకు, వాయు శక్తి సామర్థ్యం 47.96 GWకు చేరుకుంది. నవంబరు 2024 నాటికి మొత్తం సౌర ప్రాజెక...




