Numaish : హైదరాబాద్లో నుమాయిష్.. షెడ్యుల్లో మార్పు
Numaish 2025 postponed details | హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) షెడ్యుల్లో మార్పు జరిగింది. జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్ఠాత్మక ఎగ్జిబిషన్ (Numaish) ప్రారంభ తేదీని మార్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh)మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడుదినాల జాతీయ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Numaish ప్రత్యేకత ఏమిటంటే..
హైదరాబాద్లో ప్రతి ఏడాది నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Exhibition) ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దీన్ని నిర్వహిస్తారు. మొదట 1938లో 50 స్టాల్స్తో ఇది ప్రారంభమైంది. ఇప్పుడిది భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సందర్శకులను ఆకర్షిస్తోంది. షాపింగ్, వ్యాపారం, వినోదం, విశ్రాంతిని కలిపే ఈ ప్రదర్శన దేశం నలుమూలల నుంచ...




