Sarkar Live

Privacy Policy

Donald Trump | అలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష త‌ప్ప‌దు..
World

Donald Trump | అలాంటి వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేదు..ఉరిశిక్ష త‌ప్ప‌దు..

Donald Trump : మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్య‌క్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. ఇంకా ప‌వ‌ర్‌లోకి రాక‌ముందే ఆయ‌న చేప‌ట్ట‌బోయే సంచ‌లన‌ నిర్ణ‌యాల‌ను ఒక్కొక్క‌టిగా వెల్ల‌డిస్తున్నారు. మా ఈ క్రమంలో దేశంలో మరణశిక్షల‌ను కఠిన నిర్ణయం అమ‌లు చేయ‌బోతున్నామ‌ని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్ల‌డించారు. తాను అధ్యక్షుడు అయ్యాక రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుకు ఆదేశాలిస్తానని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. బైడెన్ నిర్ణయంపై Donald Trump విమర్శలు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్(Joe Biden) ఇటీవల ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40మంది ఖైదీల్లో 37మందికి జీవిత ఖైదుగా మార్చారు. ఈ నిర్ణయాన్ని డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. జో బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణిశిక్ష తగ్గించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమ‌లుచేయాల‌ని న్యాయ శా...
Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?
Trending

Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?

Christmas Celebrations 2025 ప్రపంచంలోని చాలా దేశాలు డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటాయి. చ‌ర్చిల్లో క్రీస్తు కోసం ప్రార్థ‌న‌లు, క్రిస్మ‌స్ ట్రీలు, విందు వినోదాల‌తో ఉల్లాసంగా గ‌డుపుతారు. అయితే, అన్ని దేశాలు లేదా కమ్యూనిటీలు డిసెంబ‌ర్ 25న క్రిస్మస్‌ను పాటించవు. ఆయా దేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన క్యాలెండర్లు, చారిత్రక ఆచారాల కార‌ణంగా ఈ వేడుక‌లు జ‌రుపుకోవు. 25న క్రిస్మస్ జరుపుకోని దేశాలు, వారి ప్రత్యేక సంప్రదాయాల వెనుక గల కారణాలను ఇక్కడ చూడండి. Christmas Celebrations జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటున్న దేశాలు ఈ తేదీ జూలియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13 రోజులు వెనుకబడి ఉంది. అనేక దేశాల్లోని ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘాలు జనవరి 7న క్రిస్మస్‌ను జరుపుకుంటాయి. రష్యా: రష...
Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు
National

Chhattisgarh | శవంతో శృంగారం.. అత్యాచారం కాదు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

Chhattisgarh News | శవంతో శృంగారాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (Chhattisgarh High Court) సంచ‌ల‌న‌ తీర్పు ఇచ్చింది. మైన‌ర్‌పై లైంగిదాడి, హ‌త్య‌కు సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ బిభు దత్త గురు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేం.. మైన‌ర్‌పై హ‌త్యాచార‌ కేసులో నితిన్ యాదవ్, నీలకంఠ్ నాగేశ్ దోషులుగా తేలారు. వీరు బాలిక‌ను అపహరించడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం వంటి నేరాలకు పాల్ప‌డ్డార‌ని నిర్ధార‌ణ అయ్యింది. నితిన్ యాదవ్ అత్యాచారం, కిడ్నాపింగ్, హత్య నేరాలకు దోషిగా తేలడంతో జీవిత ఖైదు శిక్ష ప‌డింది. నాగేశ్, అతడి సహచరుడికి IPC సెక్షన్ 201 (నేరానికి సంబంధించిన సాక్ష్యాలను తొలగించడం లేదా నిందితుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం)తోపాటు మ‌రికొన్ని సెక్ష‌న్ల ఆధారంగా ఏడేళ్ల జైలుశిక్ష ప‌డింది. అదే కేసులో నాగే...
kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌
State

kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌

kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ (Former CM KCR), నీటిపారుద‌ల శాఖ‌ మాజీ మంత్రి హరీశ్‌రావుకు (Former Minister Harish Rao) హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు వీరికి ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7న వాయిదా వేసింది. పిటిష‌న‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరోప‌ణ‌లు ఏమిటంటే.. గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వంలో పూర్తి చేసుకున్న కాళేశ్వరంలో ప్రాజెక్టు (kaleshwaram project ) నిర్మాణంలో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని, అవినీతి చోటుచేసుకుంద‌ని ఆరోప‌ణ‌లు వచ్చాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిపోయింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త‌గా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలిరోజుల్లోనే ఇది చోటుచేసుకుంది. దీన్ని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది...
TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ
State

TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ

TTD Vaikunta Ekadasi 2025 tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా వేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అశేష భ‌క్త‌జ‌నం పాల్గొనే ఈ ఆధ్యాత్మిక ఉత్స‌వం 2025 జనవరి 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేప‌థ్యంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ 2024 డిసెంబరు 23 ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్ల బుకింగ్ 2024 డిసెంబరు 24 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. భక్తులు తమ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అందుబాటులోకి SSD టోకెన్లు వైకుంఠ ద్వారం అనేది ఆలయ గర్భగృహాన్ని ప్ర‌ద‌క్షిణ‌ చేసే పవిత్ర మార్గం. 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇది తెరిచి ఉంటుంది. ఈ ద‌ర్శ‌నానికి భక్తులు పోటెత్త‌నుండ‌టంతో స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను అందుబాటులో ఉంచారు. ఇవి క...
error: Content is protected !!