Sarkar Live

Privacy Policy

Illegal Registrations | అడ్డూ అదుపు లేకుండా సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు..
Special Stories

Illegal Registrations | అడ్డూ అదుపు లేకుండా సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు..

అక్రమంగా అనేక రిజిస్ట్రేషన్లకు పాల్పడిన చేసిన సబ్ రిజిస్ట్రార్ హన్మకొండ జిల్లాలో అక్రమ వెంచర్లలోని వందల కొద్దీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ ఒక్కో ప్లాటుకు 30 నుంచి 50 వేలు ? వివాదంలో ఉన్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా రిజిస్ట్రేషన్ చేసినందుకు 10 లకారాల పైనే తీసుకున్నట్లు ఆరోపణలు..? సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా రిజిస్ట్రార్ ను ఆదేశించిన ఉన్నతాధికారులు ఆ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లను జిల్లా రిజిస్ట్రార్ సైతం"మాములు"గా తీసుకున్నట్లు ప్రచారం.. Illegal Registrations |  ఆ అధికారి తీరే వేరు, అక్రమార్కులకు కొమ్ముకాయడం, రియల్టర్ లతో అంటకాగడం , అక్రమాలను సక్రమంగా చేయడంలో ఈ సబ్ రిజిస్ట్రార్ "పీ హెచ్ డీ" చేసినట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు కోడైకూస్తున్నారు. పత్రాలు లేని భూమిని రిజిస్ట్రేషన్ చేయడ...
Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్‌..!
State

Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్‌..!

Formula E race case : 'ఫార్ములా ఈ' రేసు కేసులో త‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అవినీతి నిరోధ‌క విభాగానికి (ACB) అనుమ‌తినిస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యంపై భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసును న్యాయ‌ప‌రంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధ‌మేనని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం 'X' ద్వారా ఆయ‌న మంగ‌ళ‌వారం తీవ్రంగా ప్ర‌తిస్పందించారు. కేటీఆర్ ఏమ‌న్నారంటే.. తన‌పై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి 'చిట్టి నాయుడు' అంటూ కేటీఆర్ సంభోదించారు. 'ఢిల్లీలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాల ఫలితాలు కనిపిస్తున్నాయి' అని కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి 30 సార్లు వెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులైనా తెచ్చుకోలేకపోయారని, తనపై మాత్రం మూడు కేసులు పెట్టడం ద్వారా రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు...
Hush Money Case | చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. హష్ మనీ కేసులో కొత్త మ‌లుపు
Crime

Hush Money Case | చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. హష్ మనీ కేసులో కొత్త మ‌లుపు

Donald Trump : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ త‌గిలింది. హ‌ష్ మ‌నీ కేసు (Hush Money Case) లో గ‌తంలో త‌న‌ను దోషిగా ఖ‌రారు చేస్తూ గ‌తంలో వెలువ‌డిన‌ తీర్పును ర‌ద్దు చేయాల‌ని తాజాగా ఆయన చేసిన అభ్య‌ర్థ‌న‌ను జ‌డ్జి తిర‌స్క‌రించారు. అధ్య‌క్షుడిగా ట్రంప్‌కు క‌ల్పించే అధికారిక మినహాయింపును ఈ కేసులో ఇవ్వాల‌ని ఆయ‌న‌ త‌ర‌ఫున న్యాయ‌వాదులు చేసిన వాద‌న‌లను కోర్టు అంగీక‌రించ‌లేదు. కేసు ఏమిటంటే.. డోనాల్డ్ ట్రంప్ 2016 అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అక్ర‌మంగా 1,30,000 డాల‌ర్లు చెల్లింపులు చేశార‌ని, దీనికి సంబంధించిన రికార్డుల‌ను ఆయ‌న తారుమారు చేశార‌ని ఆయ‌న‌పై అభియోగం ఉంది. దీనిపై అప్ప‌ట్లో కేసు న‌మోదు కాగా 34 ర‌కాల ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న యూఎస్ సుప్రీం కోర్టు ట్రంప్‌ను దోషిగా ఖ‌రారు చేస్తూ 2023 మే నెల‌లో తీర్పు ఇచ్చింది. ఈ క్ర‌మంలో ట్రంప్ న్యాయ‌వాదులు ఆయ‌న త‌ర‌ఫున‌ కోర్టు...
SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్..  ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

SBI Clerk Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బిఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBI Clerk Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకి శుభవార్త అందించింది. భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 2024-25 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఖాళీల సంఖ్య యావత్ భారతదేశం వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 342 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ.. గడువు తేదీలు జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్ 17 దరఖాస్తు చివరి తేదీ : 2025 జనవరి 7 దరఖాస్తు లింక్ : [SBI Careers](https://bank.sbi/web/careers/current-openings...
Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
Crime

Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Telangana News | తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చక్కగా చదువుకొని నేర్చుకొని గొప్పవాడు కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. స్కూళ్లు, హాస్టళ్లలోని ఉపాధ్యాయుల తీవ్రమైన ఒత్తిడితోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం కూడా ఓ విద్యార్థి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.వివరాల్లోకెళితే.. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ ను చదువు కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ లో చేర్పిస్తే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. పాఠశాలలోని టీచర్ వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ మృతి చెందిన విషయం తె...
error: Content is protected !!