Sarkar Live

Privacy Policy

Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
State

Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

Trains Stopped : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్​లో ఏర్ప‌డిన సాంకేతిక సమస్యతో పలు ట్రైన్స్ రాకపోకలకు అంత‌రాయం క‌లిగింది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే వందే భారత్‌, దిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అరగంట పాటు నిలిచిపోవాల్సి వ‌చ్చింది .సిర్పూర్ కాగజ్​నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​లు గంటన్నర పాటు నిలిచిపోయాయి. దీంతో ప‌లు రైళ్ల‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సింగరేణి ప్యాసింజర్‌ ఉప్పల్‌ స్టేషన్‌లో 20 నిమిషాలు నిలిచిపోయింది.మెయిన్‌లైన్‌లో ఒక‌ గూడ్స్‌ రైలు ఆగింది. మరోవైపు సిగ్న‌ల్ సమస్య కారణంగా ఉప్పల్‌ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోలేదు. ఫ‌లితంగా ఇరువైపులా రోడ్ల‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా గేట్లు తెరుచుకోకపోవడంతో హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. &nb...
వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు కానిస్టేబుల్స్ మృతి
Crime

వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు కానిస్టేబుల్స్ మృతి

Accident | గజ్వేల్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళుతుండ‌గా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ఆదివారం తెల్లవారుజామున ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియ‌ని వాహ‌నం వేగంగా వ‌చ్చి వెనుక నుంచి ఢీ కొట్టి పోయింది .దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్క‌డికక్క‌డే మృతిచెందారు. కాగా మృతుడు ప‌రందాములు స్వ‌గ్రామం సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు కాగా, వెంక‌టేశ్ స్వ‌గ్రామం గాడిచర్లపల్లి. మృతులు వెంకటేష్, పరంధాములు ప్ర‌స్తుతం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఊహించ‌ని విధంగా ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి ...
Pushpa 2 box office : అల్లు అర్జున్ సినిమా రికార్డుల జాత‌ర.. 3 రోజుల్లో 600 కోట్ల మార్క్‌
Cinema

Pushpa 2 box office : అల్లు అర్జున్ సినిమా రికార్డుల జాత‌ర.. 3 రోజుల్లో 600 కోట్ల మార్క్‌

Pushpa 2 box office | అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ.. గ‌త సినిమాల వసూళ్ల రికార్డుల‌ను మూడు రోజుల్లోనే అధిగమించింది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా రూ. 600 కోట్లకు చేరుకున్న భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ప్రాథ‌మిక‌ అంచనాల ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియాలో రూ.383 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం భారతదేశంలో దాదాపు రూ. 115.58 కోట్ల నికర వసూళ్లు సాధించింది. శుక్రవారం వసూళ్లను అధిగమించి మొత్తం రూ. 383.7 కోట్లకు చేరుకుంది. హిందీ వెర్షన్ అత్యధికంగా రూ.73.5 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.31.5 కోట్లు, తమిళ వెర్షన్ రూ.7.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం నాడు పుష్ప 2 రూ.93.8 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప: ది రూల్...
రేపటి నుంచి నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్స్ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
National

రేపటి నుంచి నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్స్ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Army Agniveer Recruitment Rally | హైదరాబాద్: తెలంగాణ నుంచి అగ్నివీర్ నియామ‌కాల కోసం ఇండియ‌న్ ఆర్మీ డిసెంబర్ 8 నుంచి 16 వరకు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించ‌నుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, , పుదుచ్చేరి లోని మహిళా మిలిటరీ పోలీసుల (డబ్ల్యుఎంపి)ని కూడా ఎంపిక చేసేందుకు ర్యాలీ నిర్వహించనున్నారు. . పోస్టుల వివ‌రాలు అభ్యర్థులు అగ్నివీర్- జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (X క్లాస్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (తరగతి VIII పాస్) అగ్నివీర్​ జనరల్​ డ్యూటీ, అగ్నివీర్​ టెక్నికల్​, అగ్నివీర్​ క్లర్క్​/స్టోర్​ కీపర్ ఉద్యోగాలకు అభ్య‌ర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక అగ్నివీర్​ ట్రెడ్స్​ మెన్​కు కేవ‌లం 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ర్య...
కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి
State

కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా Hyderabad :  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు తమదే అధికారం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా  (JP Nadda) అన్నారు.  దేశంలోని  విపక్ష పార్టీలన్నీ ఏకమైనా.. మూడోసారి కూడా ప్రజలు మోదీ(PM Modi)నే ప్రధానిగా ఆమోదించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి మరో ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని సూచించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో శనివారం జ‌రిగిన‌ బీజేపీ భారీ బహిరంగ సభలో జెపి.నడ్డా మాట్లాడుతూ..  ఆరు గ్యారెంటీలు, 66 అబద్ధాలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అనే సంగతి తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్‌ (Con...
error: Content is protected !!