Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భయాందోళనలో ప్రజలు
Breaking News | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు (Earthquake) సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళనలకు గురయ్యారు. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం, ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్, మహబూబాబాద్ జిల్లా గంగారం,
కరీంనగర్ విద్యానగర్లో భూకంపం కారణంగా నిలబడిన ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి.గ్రేటర్ హైద...




