Indiramma Illu| ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమంలో లబ్ధిదారులను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఏ దశలోనూ లబ్ధ...




