Sarkar Live

Privacy Policy

Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…
Special Stories

Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…

తరుగు పేరుతో రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోతపెడుతున్నట్లు సమాచారం మామూళ్ల అలవాటు పడి చూసిచూడనట్లగా కొందరు అధికారులు! తరుగు పేరుతో తీసిన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళుతోంది? ఆ డబ్బులు ఎవరు మింగుతున్నారు? Paddy Procurement | రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అధికారులే మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు (మేతకు) అలవాటు పడి చూసీచూడనట్ల వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారుల మూలంగా మసకబార...
Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. రాజధానిలో కలకలం
National

Bomb Threats | ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. రాజధానిలో కలకలం

Delhi School Bomb Threats : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప‌లు స్కూళ్ల‌కు వ‌రుస‌గా బాంబు బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌తో సహా పలు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. ఆర్‌కే పురంలో ఒకటి, పశ్చిమ విహార్‌లోని రెండు పాఠశాలలకు హెచ్చరికలు అందాయని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న తర్వాత, రెండు పాఠశాలల నిర్వాహకులు పిల్లలను వారి ఇళ్లకు తిరిగి పంపించేశారు. డీపీఎస్ ఆర్కే పురం నుంచి ఉదయం 7.06 గంటలకు, జీడీ గోయెంకా పశ్చిమ్ విహార్ నుంచి ఉదయం 6.15 గంటలకు బాంబు బెదిరింపులు వచ్చాయని డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన‌ పాఠశాలలకు చేరుకుని సోదాలు నిర్వహి...
KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్
State

KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్

KCR | తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూర్ఖత్వమని.. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని బీఆర్‌ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఆయ‌న‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్ర‌వ్నించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు. రైతుబంధు ప్రయోజనాలు ప్ర‌జ‌ల‌కు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ...
Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్
Sports

Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్

Ind vs Ban U19 Asia Cup 2024 | క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నేడు జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టు భారత్ పై 59 పరుగుల తేడాతో గెలుపొందింది.మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 198 పరుగులు చేయగా నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భారత క్రికెటర్ లు తడబడ్డారు. ఈ మ్యాచ్ లో బంగ్లా క్రికెటర్ లు పూర్తి ఆధిపత్యాన్ని చేలాయించి భారత జట్టును కేవలం 139 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ అండర్-19 విభాగంలో 2024 ఆసియా కప్ విజేతగా చరిత్ర సృష్టించింది.   బంగ్లాదేశ్ (Bangladesh) లో తలపడిన భారత జట్టు 59 పరుగుల తేడాతో  ఓటమిని చవిచూసింది.199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలిపోయింది. మహ్మద్ అమన్ (26 పరుగులు), హార్దిక్ రాజ్ (...
Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
State

Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

Trains Stopped : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్​లో ఏర్ప‌డిన సాంకేతిక సమస్యతో పలు ట్రైన్స్ రాకపోకలకు అంత‌రాయం క‌లిగింది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే వందే భారత్‌, దిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అరగంట పాటు నిలిచిపోవాల్సి వ‌చ్చింది .సిర్పూర్ కాగజ్​నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​లు గంటన్నర పాటు నిలిచిపోయాయి. దీంతో ప‌లు రైళ్ల‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సింగరేణి ప్యాసింజర్‌ ఉప్పల్‌ స్టేషన్‌లో 20 నిమిషాలు నిలిచిపోయింది.మెయిన్‌లైన్‌లో ఒక‌ గూడ్స్‌ రైలు ఆగింది. మరోవైపు సిగ్న‌ల్ సమస్య కారణంగా ఉప్పల్‌ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోలేదు. ఫ‌లితంగా ఇరువైపులా రోడ్ల‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా గేట్లు తెరుచుకోకపోవడంతో హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. &nb...
error: Content is protected !!