Sarkar Live

Privacy Policy

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు..!
State

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) వెల్ల‌డించింది. నవంబర్‌ 30 ‌నుంచి డిసెంబర్‌ 2‌వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఈమేర‌కు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ పేర్కొంది. చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వొచ్చే  12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని అంచనా వేసింది. ఉదయంలోపు తుపానుగా మారే చాన్స్‌ ఉందని ఐఎండీ వివరించింది.శనివారం (నవంబర్‌ 30‌వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్‌, ‌మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్‌ ‌లో పేర్కొంది. ఈ ప్రభావంతో 3 రోజులు ఏపీలోని దక్షిణకోస్తాలో ...
Tenth Class Marks System | పదో తరగతి మార్కుల విధానంలో భారీ  మార్పులు
State

Tenth Class Marks System | పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులు

Tenth Class Marks System : రాష్ట్రంలోని పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్‌ మార్కులు, 80 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇక నుంచి 100 మార్కులకు తుది పరీక్షలను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది....
Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు హాస్ట‌ళ్ల‌లో ఇక‌పై ఫుడ్ సేఫ్టీ క‌మిటీలు..
State

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు హాస్ట‌ళ్ల‌లో ఇక‌పై ఫుడ్ సేఫ్టీ క‌మిటీలు..

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు, వ‌స‌తిగృహాల్లో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు(Food Safety Committees) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS ShanthiKumari) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారభద్రతపై ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లాస్థాయి అధికారులు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. కాగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధిపేటలోని గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి.. ఆహార పదార్థాలను, కనీస వసతులను స్వ‌యంగా పరిశీలించారు. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభుత్వం కమిటీలను నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక...
Ram Gopal Varma | ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా
State

Ram Gopal Varma | ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా

అమరావతి : ప్రముఖ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ (Quash petition) పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో (AP High Court) విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు త‌గిన‌ సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర‌డంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఆర్జీవీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!? ఏపీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu), ఉప‌ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఫొటోలను మార్ఫింగ్ (Photos Marfing) చేసి సోష‌ల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినందుకు గాను రాంగోపాల్‌ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు రెండుసార్లు నోటీసులు అందించినా కూడా వ...
SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!
Crime

SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!

SUICIDE IN GURUKULA SCHOOL వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌న్ తో విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతుంటే.. మరోవైపు మరికొందరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్ప‌డుతుండ‌డం కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు గురుకులాల్లో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మృతి చెందారు. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకుల పాఠ‌శాల‌ (SOCIAL WALFAR SCHOOL) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి విద్యార్థి పట్టపగలే.. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్మ‌కు పాల్ప‌డ‌డం తీవ్ర‌ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానకులు మండిప‌డుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు - సత్యమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూలి పనులు చేసుకుని శ్రీనివాసులు దంపతులు పిల్లలను ప్రభు...
error: Content is protected !!