Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు
Indian Railways Bharat Gaurav Train | విశాఖపట్నం: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ఈ సంవత్సరం రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్లను ప్రకటించింది. టూర్ టైమ్స్ నిర్వహిస్తున్న సౌత్ స్టార్ రైల్ ద్వారా భక్తులు భారత్లోని పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకునే అరుదైన అవకాశం కల్పిస్తోంది.
మొదటి యాత్రా సర్క్యూట్ నవంబర్ 16న ప్రారంభమై 11 రోజులపాటు తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంది. ఇందులో ప్రదోషం రోజున నటరాజ స్వామి, మాసిక్ శివరాత్రి రోజున అరుణాచలేశ్వర స్వామి దర్శనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు..టికెట్ ధరలు రూ. 19,950 (2SL) నుంచి రూ. 42,950 (1AC) వరకు ఉన్నాయి.
రెండో యాత్ర నవంబర్ 26న ప్రారంభమవుతుంది. ఇది 10 రోజుల పాటు సాగి పంచ ద్వారక యాత్రను కవర్ చేస్తుంది. ఇందులో నిష్కలంక్ మహాదేవ్ సముద్ర ఆలయం, జ్యోతిర...




