Sarkar Live

Privacy Policy

IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం
State

IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం

IAS transfers : తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ప్ర‌భుత్వం (State Government) స్థానచ‌ల‌నం క‌ల్పించింది. ముఖ్యంగా సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా హైకోర్టు (High Court) ఆదేశాలను పక్కనపెట్టిన కారణంగా తీవ్ర విమర్శలకు గురై ప్ర‌స్తుత బాధ్య‌తను కోల్పోయారు. ఆయ‌న్ను ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ (Transport, Roads and Building department)కు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఇదే క్ర‌మంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచల‌నం క‌ల్పించిన సర్కారు కొత్త బాధ్యతలను అప్ప‌గించింది. ఈమేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించార‌ని… సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన...
ACB Arrest  : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Crime

ACB Arrest : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్​ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవి...
మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు ఎలా? – liquor policy 2025 :
State

మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు ఎలా? – liquor policy 2025 :

Telangana new liquor policy 2025 : తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తి రెండేళ్ల‌కోసారి మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరిస్తూ కొత్త పాలసీని అమలు చేస్తోంది. 2025-2027 కాలానికి కొత్త మద్యం రీటైల్ పాలసీని ప్ర‌క‌టించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు సంబంధించిన దుకాణాల అనుమతులు, లైసెన్స్‌లు, రిజర్వేషన్లు, టెండర్ ప్ర‌క్రియ త‌దిత‌న‌న‌ అంశాలపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం పాలసీ ముఖ్యోద్దేశం ఏమిటి? మద్యం పాలసీ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మద్యం విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 40,000 కోట్లకు పైగా ఆదాయం పొందుతోంది. ఒక్క కొత్త లైసెన్స్‌లు, రిన్యువల్స్ ద్వారా సుమారు రూ.6,000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. రాష్ట్రానికి ఆదాయం పెంచడం మాత్రమే కాకుండా విక్ర‌యాల్లో పారదర్శకతను తీసుకురావడమే మ‌ద్యం ...
Industrial Training | ఐటీఐలకు కొత్త హంగులు.. ఏటీసీలుగా అత్యాధునిక శిక్ష‌ణ‌
State

Industrial Training | ఐటీఐలకు కొత్త హంగులు.. ఏటీసీలుగా అత్యాధునిక శిక్ష‌ణ‌

Industrial Training : నేటి ఆధునిక యుగానికి అనువుగా యువ‌త‌కు ఉద్యోగావకాశాలు, జీవ‌నోపాధి క‌ల్పించే విధంగా శిక్షణ కేంద్రాలు ఉండాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావించింది. పాతతరం ఐటీఐల (Industrial Training Institutes (ITIs)కు కొత్త రూపు ఇవ్వాల‌ని సంక‌ల్పించింది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ (Advanced Technology Centres (ATCs)గా ఐటీఐల‌ను మార్చింది. Industrial Training : సెప్టెంబ‌రు 27 నుంచి ప్రారంభం అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ ఏర్పాటు త‌న డ్రీమ్‌ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ( Chief Minister A. Revanth Reddy) అంటున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త శిక్షణా కేంద్రాల (modern institutes)ను సెప్టెంబరు 27న హైద‌రాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర...
Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం
State

Kaleshwaram Project కేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ విచార‌ణ ప్రారంభం

Kaleshwaram Project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ (Preliminary Enquiry)ను ప్రారంభించింది. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముందడుగు వేసింది. ఈ విష‌యాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించాయి.కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అనేక అవకతవకలపై సీబీఐ ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టనుంది. ప్రాథమిక విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, కాంట్రాక్టర్ కంపెనీల రికార్డులు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలించనుంది. ప్రధానంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదిక ఈ విచారణకు కీలక ఆధారంగా మారనుంది. ఇంజినీరింగ్ లోపాలు, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనలు, నిర్మాణంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలు వంటి అనేక అంశాలను ఆ ని...
error: Content is protected !!