Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర పరాభవం.. 67 సీట్లలో డిపాజిట్లు గల్లంతు.. ఇది ఎలా జరిగింది..?
Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం మరోసారి కొనసాగుతోంది. ఇది ఎన్నికలలో వరుసగా మూడోసారి ఘోర పరాజయం పాలైంది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 70 స్థానాల్లోనూ పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థులు 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. కేవలం మూడు స్థానాలు బద్లి, కస్తూర్బా నగర్, నంగ్లోయ్ జాట్ సెగ్మెంట్లలోనే డిపాజిట్లు దక్కించుకుంది. అయితే, ఆ పార్టీకి ఓట్ల వాటా స్వల్పంగా పెరిగి, 2020లో 4.26% నుండి ఈ సంవత్సరం 6.4%కి పెరిగింది.
ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (1998-2013) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 15 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది. ఆప్ రంగప్రవేశంతో హస్తం పార్టీ ప్రతీ ఎన్నికల్లో క్షీణతను కొసాగిస్తోంది .నాంగ్లోయ్ జాట్.
Delhi Election Results 2025...
