PCC Appointments 2025 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని अखిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు నియమితులయ్యారు. ఈ ఎంపికల్లో సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియామకాల (PCC Appointments 2025 ) ద్వారా కాంగ్రెస్ పార్టీ యువత, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ వచ్చే ఎన్నికల దృష్టితో బలమైన టీమ్ను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. క్షేత్రస్థాయిలో సేవలందించిన నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, కొత్త తరానికి ప్రాధాన్యం కల్పిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నియామకాలు జరిగాయి.
PCC Appointments 2025 : ముఖ్య నేతలకు కీలక పదవులు
- ఎంపీ నక్కా రఘువీర్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి చేరిన బొంతు రాంమోహన్ వంటి ప్రముఖులకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి.
- మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు ఈ కొత్త పదవులను పొందారు.
🔹 పిసిసి ఉపాధ్యక్షుల జాబితాలో ఉన్నవారు:
చిక్కుడు వంశీకృష్ణ, నాయిని రాజేందర్రెడ్డి, కుమార్ రావు, ఝాన్సీ రెడ్డి, బొంతు రాంమోహన్, గాలి అనిల్ కుమార్, బస్వరాజ్ సారయ్య, తదితరులు.
🔹 ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైనవారు:
మట్టా రాగమయి, పర్నికారెడ్డి, వెడ్మ బొజ్జు, షబ్బీర్ అలీ, శశికళా యాదవరెడ్డి, ఎం. బేబీ స్వర్ణకుమారి, పల్లె శ్రీనివాస్ గౌడ్, అంబడి రాజేశ్వర్, తదితరులు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.