Sarkar Live

Day: December 2, 2024

Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల‌ భారీ ఫ్లైఓవర్‌
State

Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల‌ భారీ ఫ్లైఓవర్‌

‌నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్ ఫ్లైఓవ‌ర్‌ Aramghar to Zoo Park Flyover | నిత్యం ట్రాఫిక్‌ ‌కష్టాలలో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..  నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేతుల మీదుగా ఈ భారీ ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది హైదరాబాద్ లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌. 24 ‌మీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 636 కోట్ల ఖర్చు చేశారు.  ఫ్లైఓవర్‌కు రెండువైపులా ఎనిమిది కిలోమీటర్ల సర్వీస్‌ ‌రోడ్డు పూర్తి చేయడమే ప్రాజెక్టులో అతి పెద్ద సవాల్‌. ఈ రోడ్ల‌కు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి సర్వీస్‌ ‌రోడ్‌ను చకచకా నిర్మిస్తున్నారు.ఫ్లైఓవర్‌ ‌పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి. హెచ్‌ఎం‌డీఏ ఉన్నతాధికారులతో ...
Telugu University | బాచుప‌ల్లిలో తెలుగు యూనివ‌ర్సిటీ కొత్త క్యాంప‌స్ ప్రారంభం
State

Telugu University | బాచుప‌ల్లిలో తెలుగు యూనివ‌ర్సిటీ కొత్త క్యాంప‌స్ ప్రారంభం

Hyderabad | హైద‌రాబాద్‌ బాచుపల్లిలో నిర్మించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) కొత్త క్యాంపస్ ను సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. 100 ఎకరాల ప్రాంగణంలో  ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపక‌ దినోత్సవాలను సైతం మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ విద్యార్థులకు కంప్యూటర్ల వినియోగంలో 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్టు హామీ ఇచ్చారు. విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామ‌ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుక...
Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణ‌యం..
Cinema

Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణ‌యం..

Vikrant Massey | 12th Fail మూవీతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ పెట్టారు. కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నాన‌ని, చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహక‌రించిన అంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన స‌మ‌యం వొచ్చిద‌ని అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇంత‌కాలం నాపై ప్రేమ, అభిమానం చూపినవారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఇప్పుడు నా కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సిన‌ టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతోపాటు సినీ ప్రియులు ఆశ్...
Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు
Crime

Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య హత్యకు దారితీసిన కులాంతర వివాహంకారణం..!? Ranga Reddy | సమాజంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకోవడమే ఏదో నేరమన్నట్లు క్రూరంగా చంపేస్తున్నారు.సోమవారం ఉదయం డ్యూటీ కి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) దారుణంగా హత్యకు గురయింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. తోడపుట్టిన తమ్ముడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి ఇటీవలే తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దాంతో ఆమెపై కుటుంబ సభ్యులు కొంతకాలం నుంచి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం బైక్ పై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ దారిలో సొంత తమ్ముడు పరమేశ్‌ కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా నరికి చంపినట్లు సమ...
Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
Crime

Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ ఆత్మహత్య పై పలు అనుమానాలు Telangana | ములుగు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సోమవారం ఉదయం ఓ ఎస్సై (SI) ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జిల్లాలో అసలు ఏంజరుగుతోంది అని సామాన్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే ములుగు జిల్లా వాజేడు SI హరీష్ కాసేపటి క్రితమే తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ములుగు (Mulugu) జిల్లాలో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ జరిగిన మరునాడే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ఎస్సై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎస...
error: Content is protected !!