Sarkar Live

Day: December 4, 2024

Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు
State

Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు

Ramagundam | పెద్దప‌ల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు (Tharmal Power Plants ) నిర్మిస్తామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ప్ర‌క‌టించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన 11 నెలలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామ‌ని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామ‌ని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల‌కు వడ్డీలు కడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామ‌న్నారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార...
Google | హైద‌రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్
State

Google | హైద‌రాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్

Google  | ప్ర‌ఖ్యాత టెక్ దిగ్గ‌జం గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)) ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయ‌బోయే గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐద‌వది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద‌ సెంటర్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఒక‌ ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ హబ్‌. ఇది హై సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయ‌నుంది. అత్యాధునిక పరిశోధన, ఏఐ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకారం అందించే వేదికగా నిలవ‌నుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, యువ‌త‌కు ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ సెంట...
ACB | రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు
State

ACB | రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు

  ACB | తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఏసిబి అధికారులు చేసిన తనిఖీల్లో పలు చెక్ పోస్టుల్లో లెక్కల్లో చూపని సొమ్ము బయటపడింది. ఆదిలాబాద్‌లోని భోరజ్ చెక్‌పోస్టు, నల్గొండలోని చెక్‌పోస్టు, అలంపూర్ చెక్‌పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు చేశారు. కాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఆక‌స్మిక‌ దాడులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ అధికారుల బృందాలు సీజ్ చేసిన‌ట్లు స‌మాచారం. నల్గొండ జిల్లా విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,600, భోర‌జ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, (గద్వాల్) అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు.  ...
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక
National

Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక

Devendra Fadnavis | మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు 12 రోజుల తర్వాత తెర‌ప‌డింది. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం డిసెంబర్ 5న ఆయన మూడోసారి మహారాష్ట్ర సీఎం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఫడ్నవీస్ పాల్గొన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మ‌లా సీతారామన్, రూపానీని బిజెపి నియమించిన విష‌యం తెలిసిందే.. అయితే శాసనసభా పక్ష సమావేశానికి ముందు, బిజెపి నేత‌ సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుస్తాయ‌ని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 న జ...
Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు
State

Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

  Breaking News | ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు (Earthquake) సంభ‌వించాయి. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌జ‌లంద‌రూ భయాందోళనలకు గురయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం, ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్, మహబూబాబాద్ జిల్లా గంగారం, కరీంనగర్‌ విద్యానగర్‌లో భూకంపం కార‌ణంగా నిలబడిన ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు న‌మోద‌య్యాయి.గ్రేటర్ హైద...
error: Content is protected !!