Sarkar Live

Day: December 5, 2024

Outsourcing Jobs | అంగ‌ట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…?
Special Stories

Outsourcing Jobs | అంగ‌ట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…?

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మెడికల్ కాలేజీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముతున్న ఏజెన్సీ.. నోటిఫికేషన్ ఉండదు... నిబంధనలు పాటించరు..? ఉద్యోగాల పేరుతో దందా... రంగంలోకి దళారులు 76 పోస్టులను భర్తీ చేసే క్రమంలో కోటికి పైగానే చేతులు మారినట్లు ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ Warangal | సరుకులు కావాలంటే అంగట్లో దొరుకుతాయి. అదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు (Outsourcing Jobs) కావాలంటే మాత్రం ఆ ఏజెన్సీ వద్ద మాత్రమే దొరుకుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలంటే సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి.. అప్పుడే కదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వస్తుంది అని మీరు భావిస్తున్నారా? మరి వీరేంటి అంగట్లో సరుకులు దొరికినట్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ల‌భిస్తాయంటున్నారు? అని ఆశ్చర్యపో...
Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..
State

Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..

Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాల‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తుండ‌డంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌జాస్వామ్య పాల‌న కాదు.. రాక్ష‌స పాల‌న అని ఆయ‌న మండిప‌డ్డారు.ఈ మేర‌కు హ‌రీశ్‌రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని సీఎం రేవంత రెడ్డిని నిల‌దీశారు హ‌రీశ్‌రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తిరిగి కేసు బనాయించార‌ని, ఉదయాన్నే పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అక్రమగా అరెస్టు చేసేందుకు య‌త్నించార‌ని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, త‌న‌పై, బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బె...
Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..
State

Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..

Telangana Assembly Sessions : తెలంగాణ శాస‌న స‌భ శీతాకాల సమావేశాలు డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి మొద‌లుకానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 9న ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమ‌వుతాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. కాగా ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం త‌న‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సమావేశాల్లో పలు కీలక చట్టాలపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు, కుల గ‌ణ‌న‌, మూసి ప్ర‌క్షాళ‌న‌, నూతన ఆర్ఓఆర్ చట్టం, బీసీ రిజర్వేషన్ తోపాటుపలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు స‌మాచారం. కాగా సంక్రాంతి పండుగ‌ తర్వాత రైతు భరోసా డ‌బ్బులు రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు మంత్రులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే , దీనికి సంబంధించిన...
జబర్దస్త్  కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు యాక్సిడెంట్..!
Cinema

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కు యాక్సిడెంట్..!

Jabardasth Comedian Ram Prasad : జబర్దస్త్‌ కమెడియన్‌ రాంప్రసాద్‌ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యాడు. గురువారం ఓ షూటింగ్‌కి వెళుతున్న రాంప్ర‌సాద్ కారు ప్రమాదానికి గురైనట్టు స‌మాచారం. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలిసింది. రోజుమాదిరిగానే గురువారం రాంప్రసాద్‌ కారులో షూటింగ్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హైద‌రాబాద్‌ తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్‌ కారు ముందుకు కారును ఢీకొట్టింది. కాగా రాంప్ర‌సాద్ ముందు వెళుతున్న కారు ఒక్క‌సారిగా సడెన్‌ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాంప్రసాద్‌ కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదం నుంచి త్రటిలో తప్పించుకున్న రాంప్రసాద్‌ చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాంప్రసాద్‌కు ప్రమాదం జరిగినట్టు తెలిసి అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గ...
నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..
State

నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ మొబైల్ యాప్ ను స‌చివాల‌యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామ‌ని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారి గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమ‌ని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చి పేదలకు భూములను పంచార‌ని చెప్పారు. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరా గాంధీ పంపిణీ చేశార‌ని తెలిపారు. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ... ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుంద‌ని త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దీనిని 5లక్షల రూపాయ‌ల‌కు పెంచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ల...
error: Content is protected !!