Sarkar Live

Day: December 10, 2024

Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్ర‌ద‌ర్శించాల్సిందే..
State

Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్ర‌ద‌ర్శించాల్సిందే..

Teachers Photos in Govt Schools |తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న టీచ‌ర్ల ఫొటోలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని.. పాఠశాల విద్యాశాఖ ఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంట‌నే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలిచ్చారు. కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు బ‌దులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నానే విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఈ విష‌య‌మై విద్యాశాఖకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని నరసింహారెడ్డి వెల్ల‌డించారు. ఇలా ఒకరికి బ‌దులు మరొకరు పనిచేస్తున్నట్లు నిర్ధార‌ణ అయితే వెంట‌నే కఠిన చర్యలు ...
65 పోస్టులు…4200 అప్లికేషన్లు..
Special Stories

65 పోస్టులు…4200 అప్లికేషన్లు..

డబ్బులు ఇచ్చినవారికే ప్రాధాన్యమా..?మెరిట్ లిస్ట్ ప్రకారం కేటాయిస్తారా..? నర్సంపేట మెడికల్ కళాశాల లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భారీగా అప్లై చేసుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పై దరఖాస్తు దారుల్లో అనేక అనుమానాలు ఇప్పటికే ఆ ఏజెన్సీ కొంత మంది నుండి డబ్బులు వసూళ్లు చేసినట్లు ప్రచారం..? Outsoursing jobs | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 8 మెడికల్ కళాశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలను రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీలకు అప్పజెప్పింది. ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కనిపిస్తున్నప్పటికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు మాత్రం కాసుల వర్షం కురుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 8 మెడికల్ కాలేజీల్లో ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని నర్సంపేట మెడికల్ కళాశాలలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక...
రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త కొత్త రూల్‌..! ఇకపై అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోల తీయొద్దు..!
State

రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త కొత్త రూల్‌..! ఇకపై అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోల తీయొద్దు..!

TG Assembly | రాష్ట్ర ప్ర‌భుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిబంధనలను అమలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు ఈ చర్యలు చేప‌ట్టింద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు చాన్స్ ఉండేది. ఈ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రాలు చెప్పేవారు కాదు. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ ఛానెల్స్‌ లైవ్‌ ఇవ్వొద్దని మాత్రం చెప్పేవారని.. ఫొటోలు, వీడియోల షూటింగ్‌ల‌పై ఆంక్షలు లేవని ప‌లువ‌రు గుర్తు చేస్తున్నారు. తాజా రేవంత్‌ ప్ర‌భుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలన...
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ అంటూనే విలాస జీవితం.. అర‌వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ధ్వ‌జం
National

Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ అంటూనే విలాస జీవితం.. అర‌వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ధ్వ‌జం

Arvind Kejriwal : అర‌వింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ బీజేపీ మంగ‌ళ‌వారం ఒక వీడియో విడుద‌ల చేసింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి రాజీనామా చేసినా ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులోని అధికారిక బంగ్లాను కేజ్రీవాల్ ఖాళీ చేయ‌క‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తాను ఆమ్ ఆద్మీ (సామాన్య మాన‌వుడు) అంటూనే కేజ్రీవాల్ అద్దాల మెడ‌ను క‌ట్టుకున్నార‌ని విమ‌ర్శించింది. ప్రభుత్వం తరఫున ఇల్లు తీసుకోనని చెబుతూనే 7-స్టార్ రిసార్ట్‌ను నివాసంగా మార్చుకున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నివాసంలో ప్ర‌భుత్వ ఖజాను వెచ్ఛించి రూ.1.9 కోట్లతో మార్బుల్ గ్రానైట్, లైటింగ్, రూ.1.5 కోట్లతో మరమ్మతులు, రూ. 35 లక్షలతో జిమ్, స్పాను కేజ్రీవాల్ ఏర్పాటు చేసుకున్నార‌ని మండిప‌డ్డారు. ఒక సామాన్య మ‌నిషిని అని చెప్పుకొనే కేజ్రీవాల్ ప్ర‌జ‌ల సొమ్ముతో విలాస‌వంత జీవితం గ‌డుపుతున్నార‌ని ఆరోపించారు. ఈ భ‌వ‌నానికి సంధించిన వీడియోల‌...
బెయిల్ గ్రాంటెడ్. బ‌ట్ కండీష‌న్ అప్లై.. రాంగోపాల్ వ‌ర్మ‌కు ఊర‌ట‌
Cinema

బెయిల్ గ్రాంటెడ్. బ‌ట్ కండీష‌న్ అప్లై.. రాంగోపాల్ వ‌ర్మ‌కు ఊర‌ట‌

Ramgopal varma : ఎప్పుడూ ఏదో ఒక సంద‌ర్భంగా ఎవ‌రో ఒక‌రి మీద నోరు పారేసుకోవ‌డం సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ నైజం. సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు, పోస్టుల‌తో ఆయ‌న ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై కూడా అనుచిత పోస్టులు పెట్టిన రాంగోపాల్ వ‌ర్మ ఇరుకాటంలో ప‌డ్డారు. దీనిపై కేసును ఎదుర్కొని అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయ‌న‌కు ఏపీ హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. పోలీసులు కోరిన‌ప్పుడు విచార‌ణ‌కు క‌చ్చితంగా హాజ‌రు కావాల‌ని కండీష‌న్ పెట్టింది. రాంగోపాల్ వ‌ర్మ ఏం చేశారంటే... రాంగోపాల్ వ‌ర్మ సార‌థ్యంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయ‌న‌ అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి, పవన్‌ కల...
error: Content is protected !!